రిలయన్స్ కమ్యూనికేషన్ యూజర్లు డిసెంబరు 31లోపు పోర్టింగ్ అవ్వాలి
తమ వినియోగదారులంతా ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 31 లోగా వేరే నెట్వర్క్లకు పోర్ట్ అవ్వాల్సిందిగా ఒక సమాచార ప్రకటనలో పేర్కొంది. ఇకపై రిలయన్స్ కమ్యూనికేషన్ కేవలం 4జీ సేవలను మాత్రమే అందించ
జియో రాకతో సక్రమంగా నడిచేందుకు సతమతమైన రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) తన వాయిస్ కాల్ సేవలను డిసెంబరు 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తమ వినియోగదారులంతా ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 31 లోగా వేరే నెట్వర్క్లకు పోర్ట్ అవ్వాల్సిందిగా ఒక సమాచార ప్రకటనలో పేర్కొంది. ఇకపై రిలయన్స్ కమ్యూనికేషన్ కేవలం 4జీ సేవలను మాత్రమే అందించనుందని, తన చందాదార్లకు ప్రస్తుతం అందిస్తున్న వాయిస్ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలకు తెలియపరిచింది.

ఆర్కామ్ ట్రాయ్కు చెప్పిన దాని ప్రకారం 8 టెలికాం సర్కిళ్లు ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, యూపీ ఈస్ట్, యూపీ వెస్ట్, తమిళనాడు, కర్ణాటక, కేరళ సర్కిళ్లలో 2జీ, 4జీ సేవలను అందిస్తోంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ ట్రాయ్కు చెప్పినదాన్ని బట్టి కంపెనీ సిస్టమా శ్యామ్ టెలిసర్వీసెస్కు చెందిన సీడీఎంఏ సేవలను అప్గ్రేడ్ చేస్తున్నది. సిస్టమా శ్యామ్ టెలి సర్వీసెస్కు ఢిల్లీ, రాజస్థాన్, యూపీ వెస్ట్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కోల్కత ప్రాంతాల్లో సర్వీసులను నడిపే అనుమతి ఉండింది. ఇక తమ చందాదారులకు సంబంధించి వారు చేసే ఏ పోర్టింగ్ అభ్యర్థననైనా ఆర్కామ్ నిరాకరించకూడదని ట్రాయ్ ఆర్కామ్ను ఆదేశించింది. వాయిస్ సర్వీసులను మూసివేయాలని నిర్ణయించిన ఈ సంస్థ రూ.46 వేల కోట్ల మేర అప్పులతో కునారిల్లుతోంది. ఎయిర్సెల్ విలీన ఒప్పందం సైతం తనకేమాత్రం లాభించకపోవడంతో మొత్తానికి వాయిస్ సేవలను నిలిపివేసేందుకు రిలయన్స్ కమ్యూనికేషన్ నిర్ణయించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications