గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు రూ.2971గా నిర్ణయం
అక్టోబర్ 23-25 మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జిబి) ధరను ఒక గ్రాముకు రూ. 2,971గా నిర్ణయించింది. ఈ మూడు రోజులు ప్రజలు బంగారు బాండ్లకు సంబంధించి దరఖాస్తులను బ్యాం
అక్టోబర్ 23-25 మధ్య కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జిబి) ధరను ఒక గ్రాముకు రూ. 2,971గా నిర్ణయించింది. ఈ మూడు రోజులు ప్రజలు బంగారు బాండ్లకు సంబంధించి దరఖాస్తులను బ్యాంకుల ద్వారా పంపవచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 30న కొనుగోళ్లను నిర్ధారించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.వచ్చే 12 వారాలకు సంబంధించి డిసెంబరు వరకూ అవసరమైన క్యాలెండర్ను సావరిన్ గోల్డ్ బాండ్ల విషయంలో కేంద్రం వెల్లడించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది.
గోల్డ్ బాండ్ దరఖాస్తు, కేటాయింపులు అక్టోబర్ 9వ తేదీతో మొదలుకొని డిసెంబరు 27 వరకూ అందుబాటులో ఉంటాయి. మొదటి దశ గోల్డ్ బాండ్ల కేటాయింపు అక్టోబర్ 11వ తేదీతో ముగిసింది. ఎవరి బాండ్లను వారికి కేటాయించే ప్రక్రియ వచ్చే వారం జరుగుతుంది. ఆర్బీఐని సంప్రదించిన కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రాముపైన రూ. 50 రాయితీ ఇస్తున్నది. ఇందుకోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసి, చెల్లింపులను ఆన్లైన్లో చేపట్టినవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని షరతు విధించారు.