సోమవారం లాభాలతో ప్రారంభం
గత వారం వరుస నష్టాలతో కొనసాగిన మార్కెట్లు సోమవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, ఐటీ రంగాలు 1 శాతం పెరగడంతో మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి.
గత వారం వరుస నష్టాలతో కొనసాగిన మార్కెట్లు సోమవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, ఐటీ రంగాలు 1 శాతం పెరగడంతో మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈలో రియల్టీ రంగం సైతం 1 శాతం ఎగసింది. అయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా 0.6 శాతం స్థాయిలో నష్టపోవడం ద్వారా మార్కెట్లను కొంతమేర వెనక్కి లాగాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 117 పాయింట్లు జమచేసుకుని 32,507 వద్ద నిలిచింది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 10,184 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే టెక్నాలజీ(1.26%), లోహ(1.04%), ఐటీ(0.9%), పవర్(0.85%) రంగాలు లాభపడగా మరో వైపు ఎఫ్ఎంసీజీ(0.66%), హెల్త్ కేర్(0.64%), క్యాపిటల్ గూడ్స్(0.23%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
సెన్సెక్స్ గెయినర్లలో భారతి ఎయిర్టెల్(4.99%), రిలయన్స్(3.05%), ఐసీఐసీఐ బ్యాంక్(1.82%0, విప్రో(1.63%), అదానీ పోర్ట్స్(1.36%) బాగా లాభపడగా మరో వైపు సిప్లా(2.38%), యాక్సిస్ బ్యాంక్(2.27%), కొటక్ బ్యాంక్(1.61%), హెచ్డీఎఫ్సీ(1.52%), లుపిన్(1.5%) మొదలైనవి ఎక్కువ నష్టపోయాయి.


Click it and Unblock the Notifications