For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

348 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్

టీసీఎస్‌తో మొద‌ల‌య్యే కార్పొరేట్ ఫ‌లితాల వెల్ల‌డి పట్ల ఇన్వెస్ట‌ర్లు సానుకూలంగా ఉన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 348.23 పాయింట్లు(1%) లాభ‌ప‌డి 32,182.22 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిప

|

*10వేల‌కు పైన నిఫ్టీ
దేశంలో కీల‌క ఆర్థిక స‌మాచారానికి సంబంధించిన గ‌ణాంకాలు వెల్ల‌న‌వ్వ‌డుంటంతో దేశీయ మార్కెట్లు దూసుకెళ్లాయి. ఈ రోజు మార్కెట్ ముగిసిన త‌ర్వాత ఆగ‌స్టు నెల‌ ఐఐపీ గ‌ణాంకాలు, సెప్టెంబ‌రు నెల వినియోగ‌దారు ద్ర‌వ్యోల్బ‌ణం గ‌ణాంకాలు వెలువ‌డ‌నున్నాయి. టీసీఎస్‌తో మొద‌ల‌య్యే కార్పొరేట్ ఫ‌లితాల వెల్ల‌డి పట్ల ఇన్వెస్ట‌ర్లు సానుకూలంగా ఉన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 348.23 పాయింట్లు(1%) లాభ‌ప‌డి 32,182.22 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిప్టీ 111.60 పాయింట్లు పుంజుకుని 10,096 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 సెన్సెక్స్

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.9%0, స్థిరాస్తి(1.49%), ఎఫ్ఎంసీజీ(1.18%), హెల్త్ కేర్‌(1.15%) రంగాలు బాగా లాభ‌ప‌డ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో కంపెనీల వారీగా చూస్తే హిందాల్కో(5.99%), భార‌తీ ఇన్‌ఫ్రాటెల్(5.24%), రిల‌య‌న్స్‌(4.22%), స‌న్ ఫార్మా(2.57%), అర‌బిందో ఫార్మా(2.04%) లాభ‌ప‌డిన వాటిలో ముందుండ‌గా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో భార‌తీ ఎయిర్టెల్(1.17%), కోల్ ఇండియా(0.46%), ఇన్ఫోసిస్‌(0.37%), ప‌వ‌ర్ గ్రిడ్‌(0.17%), ఏసియ‌న్ పెయింట్స్‌(0.93%) ముందున్నాయి.

English summary

348 పాయింట్లు లాభ‌ప‌డిన సెన్సెక్స్ | The benchmark BSE Sensex surged nearly 350 points in trading

The benchmark BSE Sensex surged nearly 350 points due to building up of fresh positions by participants ahead of key economic data — industrial production (IIP) for August and consumer inflation for September to be released later today.
Story first published: Thursday, October 12, 2017, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X