ప్రభుత్వ రంగ బ్యాంకుల దెబ్బతో మార్కెట్లలో నష్టాలు
చివరి గంటల్లో కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను బలహీనపరచడంతో సెన్సెక్స్ 32,000 దిగువకు చేరింది. నిఫ్టీ 10,000 పాయింట్ల మైలురాయిని కోల్పోయింది.
చివరి గంటల్లో కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను బలహీనపరచడంతో సెన్సెక్స్ 32,000 దిగువకు చేరింది. నిఫ్టీ 10,000 పాయింట్ల మైలురాయిని కోల్పోయింది. ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా 2.5 శాతం పతనంకాగా.. రియల్టీ, మెటల్, ఫార్మా, బ్యాంక్ నిఫ్టీ, ఆటో 2-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఐటీ రంగం మాత్రమే (0.55 శాతం) లాభపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ 90 పాయింట్లు నష్టపోయి 31,834 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 32 పాయింట్లు క్షీణించడంతో 9984 వద్ద ముగిసింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి రంగం(2.01%), లోహ రంగం(1.43%0, బ్యాంకింగ్(0.97%), హెల్త్ కేర్(0.86%) నష్టపోగా మరో వైపు చమురు, సహజ వాయువు (1.11%), టెక్నాలజీ(0.65%), ఐటీ(0.3%) లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో భారతీ ఎయిర్టెల్(5.04%), టీసీఎస్(1.66%), విప్రో(1.43%), ఎమ్ అండ్ ఎం(1.3%), హెచ్యూఎల్(0.32%) లాభపడగా, టాటామోటార్స్(2.02%), స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా(1.97%), డాక్టర్ రెడ్డీస్(1.47%), లుపిన్(1.42%), టాటా స్టీల్(1.4%) నష్టపోయాయి.


Click it and Unblock the Notifications