For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 వేల మార్కును దాటిన నిఫ్టీ

మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 77.52 పాయింట్లు పుంజుకుని 31,924.41 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 28.2 పాయింట్లు ఎగ‌సి 10,016.95 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

|

బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 80 పాయింట్ల వ‌ర‌కూ లాభ‌ప‌డింది. నిఫ్టీ మ‌ళ్లీ 10 వేల మార్కును దాటేసింది. దేశ వృద్ది రేటు ప్ర‌మాదంలో ఏమీ లేద‌ని ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ వ్యాఖ్యల‌తో మార్కెట్లు లాభాల్లో ప్రారంభ‌మ‌య్యాయి. దేశీయ సెంటిమెంటు బాగుండ‌టంతో పాటు ఆసియా మార్కెట్ల‌లో సానుకూల‌త‌తో మార్కెట్లు లాభాల్లోనే క‌ద‌లాడాయి. ట్రేడింగ్‌ చివ‌ర‌కు లాభాల‌తోనే ముగిశాయి. మార్కెట్లు ముగిసే స‌రికి సెన్సెక్స్ 77.52 పాయింట్లు పుంజుకుని 31,924.41 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 28.2 పాయింట్లు ఎగ‌సి 10,016.95 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

సెన్సెక్స్

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ప‌వ‌ర్ (0.85%), మౌలిక రంగం(0.76%), టెక్నాల‌జీ(0.62%) లాభాల్లో ముగియ‌గా మ‌రో వైపు స్థిరాస్తి(0.97%), ఎఫ్ఎంసీజీ(0.24%) న‌ష్టాలతో స‌రిపెట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో వివిధ సూచీల‌ను గ‌మ‌నిస్తే లుపిన్‌(1.99%), ప‌వ‌ర్ గ్రిడ్91.86%), యాక్సిస్ బ్యాంక్(1.74%), రిల‌య‌న్స్(1.52%), కోల్ ఇండియా(1.44%) లాభాల్లో సాగిన వాటిలో ఉండ‌గా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్(0.96%), టాటా స్టీల్‌(0.93%), హెచ్‌యూఎల్(0.83%), ఐటీసీ(0.82%), స‌న్ ఫార్మా(0.5%) ముందున్నాయి.

English summary

10 వేల మార్కును దాటిన నిఫ్టీ | Sensex ends higher by 77 points

The benchmark BSE Sensex ended higher by nearly 80 points on Tuesday due to sustained buying by domestic institutional investors and positive Asian cues.
Story first published: Tuesday, October 10, 2017, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X