5800 అనుమానస్పద కంపెనీలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు చేసిన వారికి సంబంధించిన సమాచారాన్ని 13 బ్యాంకులు అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపు 5800 అనుమానాస్పద కంపెనీల నుంచి అధికమొత్తంలో డిప
* నోట్ల రద్దు తర్వాత డొల్లకంపెనీల ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు చేసిన వారికి సంబంధించిన సమాచారాన్ని 13 బ్యాంకులు అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపు 5800 అనుమానాస్పద కంపెనీల నుంచి అధికమొత్తంలో డిపాజిట్లు చేయడాన్ని గుర్తించామని పేర్కొంది. ఈ ఖాతాలను బ్యాంకు అధికారులు గుర్తించారని వెల్లడించింది. 5800 డొల్ల కంపెనీలకు చెందిన 13,140 బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.4574కోట్లు డిపాజిట్ అయ్యాయని పేర్కొంది. పలు కంపెనీలు అందులోంచి వెంటనే రూ.4,552కోట్లను వెనక్కి తీసుకున్నాయని పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత జరిగిన 2,09,032 కంపెనీల లావాదేవీలపై ప్రభుత్వం దర్యాప్తు చేసింది.

నోట్ల రద్దు సమయంలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను చెలామణిలో ఉన్న నోట్లతో మార్చుకుని ఆ తర్వాత పలు కంపెనీలు కొన్ని ఖాతాలను మూసివేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. 13 జాతీయ బ్యాంకులు అందజేసిన నివేదిక ఆధారంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆయా కంపెనీలు రూ.4,753కోట్ల మేరకు లావాదేవీలు నిర్వహించాయి. తద్వారా బ్యాంకు లావాదేవీలు, ఖాతాల సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. అనంతరం ఖాతాలు మూసివేయడంతో లావాదేవీలు మందగించాయి. మూతపడ్డ కంపెనీలు పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి తమ నల్లధనాన్ని మార్చుకున్నట్టు ఐటి అధికారులు గుర్తించారు. 2016 నవంబర్ 8కి ముందుకు 429 కంపెనీల ఖాతాల్లో ఎలాంటి బ్యాలెన్స్ లేదు. ఆ తర్వాత వీటిల్లో రూ.11 కోట్ల మేర జమ అయ్యాయి. అనంతరం ఈ ఖాతాలను ప్రభుత్వం స్తబ్దతలో పెట్టిన సమయం నాటికి రూ.42,000కు డిపాజిట్లు తగ్గాయి. అంతలోపే చాలా కంపెనీలు తమ నగదును ఉపసంహరించుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఒక కంపెనీకి అత్యధికంగా 2,134 బ్యాంకు ఖాతాలు ఉండగా, మరికొన్నింటికి 900, 300 ఖాతాలు ఉన్నాయి. ఎక్కువ కంపెనీలకు 100కు పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొన్ని కంపెనీల బ్యాంకు ఖాతాల్లో అప్పులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల నుంచి కోట్లలో నగదు జమ కావడం, విత్డ్రా చేయడం జరిగినట్లు గుర్తించారు. డొల్ల కంపెనీలను గుర్తించి వాటిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దు తర్వాత ఏయే బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో నగదు జమ అయ్యిందనే వాటికి సంబంధించిన వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెలికి తీస్తోందని తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications