For Quick Alerts
For Daily Alerts
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో మార్కెట్లకు లాభాలు
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాలతో దేశీ స్టాక్ మార్కెట్లు పటిష్ట లాభాలు ఆర్జించాయి. రోజు మొత్తం సానుకూలంగా కదిలి చివరికి ఇంట్రాడే గరిష్టం వద్దే స్థిరపడ్డాయి
|
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాలతో దేశీ స్టాక్ మార్కెట్లు పటిష్ట లాభాలు ఆర్జించాయి. రోజు మొత్తం సానుకూలంగా కదిలి చివరికి ఇంట్రాడే గరిష్టం వద్దే స్థిరపడ్డాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 31,814 వద్ద నిలిచింది. నిఫ్టీ 91 పాయింట్లు ఎగసి 9,980 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్లో రంగాల వారీగా చూస్తే లోహ, ఇంధనం, చమురు,పీఎస్యూ రంగాలు లాభపడ్డ వాటిలో ఉండగా స్థిరాస్తి రంగం నష్టపోయింది.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో గెయిల్ ఇండియా(5.06%), టాటా స్టీల్(4.61%), హిందాల్కో(4.22%), సన్ ఫార్మా ఇండస్ట్రీస్(3.19%), బజాజ్ ఫైనాన్స్(3.08%) ఉండగా మరో వైపు నష్టపోయిన వాటిలో హీరో మోటోకార్ప్(1.37%), భారతీ ఇన్ఫ్రాటెల్(1.16%), హెచ్డీఎఫ్సీ(0.67%), డాక్టర్ రెడ్డీస్(0.56%), ఇండస్ ఇండ్ బ్యాంక్(0.37%) ఉన్నాయి.
Comments
English summary
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో మార్కెట్లకు లాభాలు | sensex surges 222 points as due to expectations on gst council meet
Story first published: Friday, October 6, 2017, 19:11 [IST]