For Quick Alerts
For Daily Alerts
స్వల్పంగా పుంజుకున్న బంగారం ధర
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు, స్థానిక బంగారు వ్యాపారులు కొనుగోళ్లు జరపడంతో బంగారానికి స్వల్పంగా డిమాండ్ పెరిగింది. దీంతో రేట్లు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది.
|
బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పుంజుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.75 పెరిగి రూ.30,450గా పలుకుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు, స్థానిక బంగారు వ్యాపారులు కొనుగోళ్లు జరపడంతో బంగారానికి స్వల్పంగా డిమాండ్ పెరిగింది. దీంతో రేట్లు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. వెండి సైతం కాస్త కోలుకొని కేజీకి 100 రూపాయలు పెరిగి రూ. 40,100 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా సైతం బంగారం ధరలు 0.03% పెరిగి ఔన్సుకు 1268.20 అమెరికన్ డాలర్లుగా పలుకుతోంది. అదే వెండి మాత్రం 0.06% పెరిగి ఔన్సుకు 16.59 అమెరికా డాలర్లుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 99.9%, 99.5% స్వచ్చత గల బంగారం ధరలు రూ.75 పెరగడంతో రూ.30,450గాను, రూ.30,300గాను పలుకుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్లో బంగారం రూ.225 తగ్గిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటాయి. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలుగు గుడ్రిటర్న్స్ గోల్డ్,సిల్వర్ రేట్ల విభాగాన్ని చూడొచ్చు.
బంగారం, వెండి ధరలు-ప్రధాన నగరాల్లో
Comments
English summary
స్వల్పంగా పుంజుకున్న బంగారం ధర | gold rates rises as positive global cues and demand from local jewellers
Story first published: Friday, October 6, 2017, 17:06 [IST]