For Daily Alerts
ఎస్బీఐ కొత్త ఛైర్మన్ రజనీష్ కుమార్
దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నూతన ఛైర్మన్గా రజనీష్ కుమార్ను నియమించారు. ఈ శుక్రవారం అరుంధతి భట్టాచార్య పదవీ కాలం ముగియనుండటంతో కొత్త చైర్మన్ నియామకం జరిగింది.
|
దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ నూతన ఛైర్మన్గా రజనీష్ కుమార్ను నియమించారు. ఈ శుక్రవారం అరుంధతి భట్టాచార్య పదవీ కాలం ముగియనుండటంతో కొత్త చైర్మన్ నియామకం జరిగింది. రజనీష్ కుమార్ ఈ పదవిలో మూడేళ్ల పాటు పనిచేస్తారు. ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన ఆయన మూడు దశాబ్దాలకు పైగా ఎస్బీఐ బ్యాంకులో పనిచేశారు. నలుగురు ఎండీలను ఇంటర్వ్యూ చేసిన బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో చివరకు చైర్మన్ పదవికి తగిన వ్యక్తిగా రజనీష్ను ఎంపిక చేసింది.
రజనీష్ కుమార్ 1980లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరారు. దాదాపు 37 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సీఈవోగా సైతం పనిచేశారు. పెద్ద మొత్తాల్లో అప్పులు ఇవ్వడం, ప్రాజెక్ట్ ఫైనాన్స్, ఫారిన్ ఎక్స్చేంజీ, రిటైల్ బ్యాంకింగ్ విభాగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది.
Comments
English summary
ఎస్బీఐ కొత్త ఛైర్మన్ రజనీష్ కుమార్ | Rajanish kumar is New chairman of state bank of India (SBI)
Story first published: Wednesday, October 4, 2017, 17:15 [IST]