For Quick Alerts
For Daily Alerts
సౌభాగ్య యోజన: ప్రతి ఇంటికీ విద్యుత్
ప్రధాన మంత్రి ఈ రోజు సహజ్ బిజ్లి హర్ ఘర్ యోజన లేదా సౌభాగ్య పేరిట కొత్త విద్యుత్ యోజన పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా పేద ప్రజల ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపాలనేదే లక్ష్యం
|
ప్రధాన మంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దెబ్రోయ్ అధ్యక్షుడిగా ఆర్థిక సలహా కమిటీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో 5 మంది సభ్యులు ఉంటారు. సుర్జిత్ భల్లా, రతిన్ రాయ్, అసిమా గోయెల్ ఇందులో తాత్కాలిక సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ ముఖ్య సలహాదారు రతన్ వాటాల్ ఇందులో సభ్య కార్యదర్శిగా పనిచేస్తారు. ఏదైనా ఆర్థిక విషయాలకు సంబంధించి ఈ సలహా కమిటీ ప్రధానికి విశ్లేషణలను అందిస్తుంది. స్థూల ఆర్థిక విధానాలకు సంబంధించి పలు విషయాలను ఈ కమిటీ చూస్తుంది.
ప్రధాన మంత్రి ఈ రోజు సహజ్ బిజ్లి హర్ ఘర్ యోజన లేదా సౌభాగ్య పేరిట కొత్త విద్యుత్ యోజన పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా పేద ప్రజల ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపాలనేదే లక్ష్యం. డిసెంబరు లోగా అన్ని గ్రామాలకు విద్యుత్ను అందించిన తర్వాత నుంచి , ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఈ పథకంలో భాగంగా మార్చి 31,2019 లోగా ప్రతి ఇంటికీ విద్యుత్ను అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 16,320 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనుంది. గ్రామీణ ప్రాంతాల కోసం రూ.14025 కోట్లు, రూ.2295 కోట్లను పట్టణ ప్రాంతాల కోసం కేటాయించనున్నారు.
Comments
English summary
సౌభాగ్య యోజన: ప్రతి ఇంటికీ విద్యుత్ | centre launches Saubhagya scheme to give electricity to each and every house
Story first published: Monday, September 25, 2017, 19:12 [IST]