స్టాక్ ట్రేడింగ్ స‌మ‌యం సాయంత్రం 5 వ‌ర‌కూ పెంపు!

దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలనే ప్రతిపాదనను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిశితంగా పరిశీలిస్తోంది.

దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలనే ప్రతిపాదనను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిశితంగా పరిశీలిస్తోంది. గతంలో సాయంత్రం 5 గంటల వరకు, 5:30 గంటల వరకు, రాత్రి 7:30 గంటల వరకు స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని పెంచాలన్న ప్రతిపాదనలు వ‌చ్చాయి.

 స్టాక్ ట్రేడింగ్ స‌మ‌యం సాయంత్రం 5 వ‌ర‌కూ పెంపు!

అయితే 5 గంటల వరకు పెంచాలనే ప్రతిపాదనపట్ల సెబీ మొగ్గు చూపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెబీకి చెందిన ఓ సలహా కమిటీ దీనిపై చర్చలు జరపనుండగా, ట్రేడింగ్ సమయం పెంచడం వల్ల వ్యయప్రయాసలకు గురవుతామన్న అభిప్రాయాలను కొందరు బ్రోకర్లు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప‌క్క బ్రోక‌ర్లు అభ్యంత‌పెడుతున్నప్పటికీ.. సెబీ పెంపు దిశగానే వెళ్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 18న సెబీ బోర్డు సమావేశం జరగనుండగా, అందులో ఈ ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకే ట్రేడింగ్ జరుగుతున్నది తెలిసిందే. 2009లో మార్కెట్ ప్రారంభ సమయాన్ని ఉదయం 9:45 గంటల నుంచి 9 గంటలకు మార్చారు. 2009 అక్టోబర్‌లోనే ట్రేడింగ్ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచుకోవచ్చని స్టాక్ మార్కెట్లకు సెబీ అనుమతిచ్చింది. అయతే అప్పుడు బ్రోకర్లు వ్యతిరేకించడంతో అమల్లోకి రాలేదు. తాజాగా మళ్లీ ఈ అంశం తెరపైకి రాగా, ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌లతో సంప్రదింపులు జరిపిన తర్వాత సెబీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+