For Quick Alerts
For Daily Alerts
200 పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్
మొత్తానికి మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 31882 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 10వేల పాయింట్లు దాటి 10,006 వద్ద స్థిరపడింది.
|
మధ్యాహ్నం ట్రేడింగ్ తర్వాత దేశీయ మార్కెట్లు సానుకూలంగా సాగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్తో కూడిన బ్యాంకింగ్ రంగ షేర్లు బాగా రాణించాయి. భారత్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ మెర్జింగ్ వార్తలతో అటు ఇండస్ బ్యాంక్, ఇటు ఈ కంపెనీ షేర్లు సైతం లాభపడ్డాయి. మొత్తానికి మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 31882 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 10వేల పాయింట్లు దాటి 10,006 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్(2.6%), పవర్(1.87%), బ్యాంకింగ్(1.14%), మౌలిక రంగం(1.12%) లాభపడగా మరో వైపు ఐటీ సూచీ(0.14%), టెక్నాలజీ(0.13%), హెల్త్కేర్(0.03%) నష్టపోయాయి.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో ఎల్ అండ్టీ(3.8%), ఏసియన్ పెయింట్స్(2.84%), మారుతి(2.41%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1.95%), ఎన్టీపీసీ(1.67%) ముందుండగా మరో వైపు ఎం అండ్ ఎం(1.1%), ఇన్ఫోసిస్(0.66%), సన్ఫార్మా(0.55%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.4%), ఐసీఐసీఐ బ్యాంక్(0.34%) నష్టపోయాయి.
Comments
English summary
200 పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్ | bse sensex gains over 200 points with positive cues in the market
Story first published: Monday, September 11, 2017, 16:53 [IST]