100 పాయింట్లకు లాభంలో సెన్సెక్స్
మార్కెట్లు మంగళవారం సానుకూలంగా సాగాయి. కన్సూమర్ డ్యూరబుల్స్, స్థిరాస్తి రంగాలు రాణించడంతో సెన్సెక్స్. నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 107.30(0.34%) పాయింట్ల లాభంతో
ఒక పక్క ఉత్తర కొరియా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లు మంగళవారం సానుకూలంగా సాగాయి. కన్సూమర్ డ్యూరబుల్స్, స్థిరాస్తి రంగాలు రాణించడంతో సెన్సెక్స్. నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 107.30(0.34%) పాయింట్ల లాభంతో 31,809.55 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 39.35 పాయింట్లు పుంజుకుని 9952 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్లో రంగాల వారీగా చూస్తే కన్సూమర్ డ్యూరబుల్స్(2.32%), స్థిరాస్తి91.56%), చమురు,సహజ వాయువు రంగం(1.02%), లోహ రంగం(0.76%) లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో ఈ రోజు ట్రేడింగ్లో లాభపడిన వాటిలో కోల్ ఇండియా(2.98%), టెక్ మహీంద్రా(2.82%), అల్ట్రాటెక్ సిమెంట్(2.44%), అంబుజా సిమెంట్(2.04%), ఏసీసీ(1.91%) ఉండగా, నష్టపోయిన వాటిలో భారతీ ఎయిర్టెల్(2.38%), సన్ఫార్మా(1.27%), భారతీ ఇన్ఫ్రాటెల్(1.56%), బోష్(1.03%), పవర్ గ్రిడ్(0.64%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications