కొంపముంచిన ఉత్తర కొరియా అణు పరీక్షలు
ఉత్తర కొరియా అణు పరీక్షల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లన్నింటిపైనా పడింది. చాలా దేశీయ సూచీలు నష్టాల్లో కొనసాగాయి. దేశీయ మార్కెట్లలో కూడా ఈ ప్రతికూలత కనిపించింది.
ఉత్తర కొరియా అణు పరీక్షల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లన్నింటిపైనా పడింది. చాలా దేశీయ సూచీలు నష్టాల్లో కొనసాగాయి. దేశీయ మార్కెట్లలో కూడా ఈ ప్రతికూలత కనిపించింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు నష్టపోయి 31702 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 61.55 పాయింట్లు క్షీణించి 9912.85 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఆటో రంగం(0.78%), బ్యాంకింగ్ రంగం(0.78%), మూలధన వస్తువులు(0.74%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.17%), ఎఫ్ఎంసీజీ(0.76%) నష్టపోయాయి.
బీఎస్ఈలో కంపెనీల వారీగా చూస్తే బాంబేడైయింగ్(9.96%), టీవీ18 బ్రాడ్కాస్ట్(7.81%), రేమండ్(5.71%), శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్(5.30%), సన్టీవీ(5.07%) లాభపడిన వాటిలో ఉండగా ; అదానీపవర్(5.21%), జస్ట్డయల్(4.57%), రిలయన్స్ క్యాపిటల్(4.37%), ఐవోసీ(4.17%), అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(4.10%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications