For Quick Alerts
For Daily Alerts
కార్లపై జీఎస్టీ సుంకం పెంపు
మధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్యూవీలకు సంబంధించిన సెస్సును పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ ఆయా కార్లపై సెస్సు 15 శాతం దాకా ఉంది. దీన్ని 25 శాతం వరకూ పెంచేందుకు రంగం సిద్
|
మధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్యూవీలకు సంబంధించిన సెస్సును పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ ఆయా కార్లపై సెస్సు 15 శాతం దాకా ఉంది. దీన్ని 25 శాతం వరకూ పెంచేందుకు రంగం సిద్దమైంది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. ఎస్యూవీలు, మధ్య స్థాయి, పెద్ద కార్లకు సంబంధించి జీఎస్టీ సుంకాన్ని పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆగస్టు 5న ఆమోదం తెలిపింది. అయితే జీఎస్టీ చట్టం,2017 లో సెక్షన్8ని సవరిస్తేనే ఈ సుంకం పెంపుకు వీలవుతుంది.
జీఎస్టీ అమల్లోకి రాకముందు మోటారు వాహనాలపై పన్ను 52-54.72 శాతానికి అదనంగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఆక్ట్రాయ్ రూపంలో మరో 2.5% పన్ను అదనంగా విధించేవారు. జీఎస్టీ అమలు తర్వాత మొత్తం విధించే పన్ను 43 శాతం వరకూ ఉంది. అయితే జీఎస్టీ అమలుకు ముందు కార్లపై ఎంతయితే పన్నుందో ఆ స్థాయికి వెళ్లేందుకు సుంకాన్ని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచాల్సి ఉంది. జీఎస్టీ వల్ల కలిగిన ప్రయోజనంతో చాలా ఎస్యూవీలు రూ.1.1 నుంచి 3 లక్షల మధ్య రేట్లను తగ్గించాయి. ఇప్పుడు మళ్లీ సెస్ ప్రభావంతో కార్ల ధరలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.
Comments
English summary
కార్లపై జీఎస్టీ సుంకం పెంపు | Cabinet clears Ordinance to hike gst cess on cars
Story first published: Wednesday, August 30, 2017, 15:49 [IST]