For Quick Alerts
For Daily Alerts
ఆగస్టు 25 నుంచి రూ.200 నోటు చలామణీలోకి
ఈ నోటు పసుపు రంగులో ఉంటుంది. ఈ నోటు పరిమాణం 66మి.మీ*146మి.మీ ఉంటుంది. 200 అనే అక్షరాలు దేవనాగరి లిపిలో సైతం ఉంటాయి.
|
ఆగస్టు 25 నుంచి రూ.200 నోటును చలామణీలోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది. నోటు వెనుక పెద్దగా సాంచి స్తూపం బొమ్మ ఉంటుంది. నోటు వెనుక వైపు ఎడమ పక్కన స్వచ్చభారత్ నినాదం, లోగో ఉంటాయి. ఈ నోటు పసుపు రంగులో ఉంటుంది. ఈ నోటు పరిమాణం 66మి.మీ*146మి.మీ ఉంటుంది. 200 అనే అక్షరాలు దేవనాగరి లిపిలో సైతం ఉంటాయి.
అన్ని నోట్లలాగే మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. ఈ నోట్లపై ఆర్బీఐ నూతన గవర్నర్ ఊర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. ఆర్బీఐ, భారత్ అని హిందీలో, ఇండియా అని ఆంగ్లంలో, 200 అక్షరాలు సూక్ష్మంగా నోటు మీద ముద్రించబడి ఉంటాయి. నోటుకు ముందు వైపు కుడిపక్క అశోక స్తూపం ఉంటుంది.
Comments
English summary
ఆగస్టు 25 నుంచి రూ.200 నోటు చలామణీలోకి | 200 Note come into circulation from august 25th
Story first published: Thursday, August 24, 2017, 14:08 [IST]