For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

276 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్‌ రంగాల్లో ఊపందుకున్న కొనుగోళ్ల‌తో దేశీయ మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. దాదాపు సూచీలు రెండూ 1% మేర లాభ‌ప‌డ్డాయి. అంత‌ర్జాతీయ సానుకూల ప‌రిణామాలు మన మార్కెట్లు బాగా రాణించే

|

స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్‌ రంగాల్లో ఊపందుకున్న కొనుగోళ్ల‌తో దేశీయ మార్కెట్లు లాభాల బాట ప‌ట్టాయి. దాదాపు సూచీలు రెండూ 1% మేర లాభ‌ప‌డ్డాయి. అంత‌ర్జాతీయ సానుకూల ప‌రిణామాలు మన మార్కెట్లు బాగా లాభాలు గ‌డించేందుకు దోహ‌ద ప‌డ్డాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 276 పాయింట్ల లాభంతో 31,568 వ‌ద్ద ముగియ‌గా; మ‌రో సూచీ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 9852.5 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(0.04%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.75%) న‌ష్ట‌పోగా మిగిలిన కీల‌క రంగాలు లాభాల బాట ప‌ట్టాయి. స్థిరాస్తి(3.48%), లోహ రంగం(1.81%), బ్యాంకింగ్(1.39%), పీఎస్‌యూ(1.2%) లాభాల బాట‌లో సాగిన వాటిలో ఉన్నాయి.

లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

స్థిరాస్తి రంగంలో డీఎల్ఎఫ్ దాదాపు 8% లాభాల‌ను స్వీక‌రించింది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఏకీకృతానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఒక విధానాన్ని రూపొందించేందుకు సిద్ద‌మ‌వ‌డంతో బ్యాంకింగ్ రంగ షేర్లు లాభ‌ప‌డ్డాయి.
బీఎస్ఈ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో అదానీ పోర్ట్స్‌(2.79%), భార‌తీ ఎయిర్‌టెల్(2.41%), టాటా స్టీల్(2.28%), డాక్ట‌ర్ రెడ్డీస్‌(2.25%), ఇన్ఫోసిస్(1.98%) ముందుండ‌గా; మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో హెచ్‌యూఎల్(1.05%), స‌న్ ఫార్మా(0.45%), ఐటీసీ(0.28%), ప‌వ‌ర్ గ్రిడ్‌(0.21%), ఎం అండ్ ఎం(0.13%) ఉన్నాయి.

English summary

276 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ | Sensex up 276 points on positive global cues

The Sensex and Nifty ended higher by nearly one per cent owing to heavy buying in realty, metal, banking and PSU stocks amid mixed global cues.
Story first published: Wednesday, August 23, 2017, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X