బంగారం దిగుమతులపై 3% జీఎస్టీ చెల్లించనున్న బ్యాంకులు
బ్యాంకులు తాము దిగుమతి చేసుకునే బంగారంపై 3శాతం జీఎస్టీ చెల్లించి, తర్వాత దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో క్లెయిం చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
బ్యాంకులు తాము దిగుమతి చేసుకునే బంగారంపై 3శాతం జీఎస్టీ చెల్లించి, తర్వాత దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో క్లెయిం చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగారం రత్నాభరణాలు వంటి వాటిపై వ్యాపారులు అడిగిన ప్రశ్నలకు సీబీఈసీ సమాధానమిస్తూ బ్యాంకులు ఇదివరకటికైతే ఎటువంటి వ్యాట్ చెల్లించేవి కావనీ కేవలం కస్టమ్స్ సుంకం చెల్లించేవని వివరించింది.అయితే ఇకపై జీఎస్టీ చెల్లించాలని వెల్లడించారు. "జీఎస్టీ అమలు ప్రారంభం అయిన తర్వాత 3శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని అన్ని విలువైన లోహాలపై చెల్లించాలి. దీనికి అదనంగా కస్టమ్స్ సుంకం చెల్లించాలి."
ఎటువంటి ఖరీదైన లోహాలు, ఆభరణాలు దిగుమతి చేసుకున్నా వాటిని సరఫరా చేసే వారు కాదు భారాన్ని వహించాల్సింది. దాన్ని ఎవరైతే దేశంలోకి రప్పించుకుంటున్నారో వారే ఐజీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని సీబీఈసీ చెప్పింది. "దిగుమతులకు సంబంధించి సొంత దారు ఎవరన్నది ముఖ్యం కాదు. నమోదిత సంస్థలయిన బ్యాంకులు, తాము తెప్పించుకున్న బంగారంపై పన్ను చెల్లించవలసి ఉంటుంది." అని ప్రశ్నలకు సమాధానంలో సీబీఈసీ వివరించింది.
బంగారం దిగుమతులు 10% కస్టమ్స్ డ్యూటీకి అర్హత సాధిస్తాయి. జీఎస్టీ రాక మునుపు దానికి అదనంగా 12.5% కౌంటర్వెయిలిగ్ డ్యూటీ(సీవీడీ) ఉండేది. జీఎస్టీ వచ్చిన తర్వాత సీవీడీని తీసేశారు కనుక జీఎస్టీ రేటు 3% బంగారంపై వర్తిస్తుంది.