స్వల్ప లాభంతో ముగిసిన మార్కెట్లు
రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ ఈ రోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభంతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 31,291.85 పాయింట్ల వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 11.2 పాయింట్ల(0.1
రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ ఈ రోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభంతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 31,291.85 పాయింట్ల వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 11.2 పాయింట్ల(0.11%) లాభంతో 9765.55 వద్ద స్థిరపడింది.
రంగాల వారీగా చూస్తే చమురు,సహజ వాయు(1.31%), హెల్త్ కేర్(0.77%), పీఎస్యూ(0.27%), బ్యాంకింగ్(0.2%) లాభపడ్డాయి. మరో వైపు స్థిరాస్తి రంగం(1.44%), పవర్(1.1%), మౌలిక రంగం(0.93%), ఆటో రంగం(0.75%) నష్టపోయాయి.

సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(2.67%), లుపిన్(2.32%), సన్ ఫార్మా(2.24%), ఓఎన్ఝీసీ(1.11%), యాక్సిస్ బ్యాంక్(1.01%) ఉండగా మరో వైపు నష్టపోయిన వాటిలో ఎన్టీపీసీ(2.56%), హీరో మోటోకార్ప్(2.07%), బజాజ్ ఆటో(1.09%), టీసీఎస్(0.85%), ఎల్ అండ్ టీ(0.64%) ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications