For Quick Alerts
For Daily Alerts
ఆగస్టు 22 బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ప్రైవేటీకరణకు నిరసనగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 10 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 22 న దేశ వ్యాప్త సమ్మె చేయనున్నారు.
|
ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్(ఐబీఏ), బ్యాంకు ఉద్యోగుల సంఘాలకు మధ్య కొనసాగుతున్న చర్చలు సఫలం కాలేదు. దీంతో సమ్మె అనివార్యమవుతోంది. ప్రైవేటీకరణకు నిరసనగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 10 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 22 న దేశ వ్యాప్త సమ్మె చేయనున్నారు. తొమ్మిది యూనియన్లకు, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) ఈ విషయం ప్రకటించింది.
ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఐబీఏ చెబుతోందని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. వివిధ విషయాల మీద చర్చలు జరుగుతున్న సమయంలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లకూడదని ఐబీఏ ముఖ్యాధికారి వీజీ కన్నన్ అన్నారు. మరో వైపు దీనికి బదులిస్తూ ఏఐబీఈఏ ఛైర్మన్ "మేము లేవనెత్తిన విషయాలు చాలా ముఖ్యమైన"వని చెప్పారు.
Comments
English summary
ఆగస్టు 22 బ్యాంకు ఉద్యోగుల సమ్మె | Bank unions firm on strike as talks with IBA fail
Story first published: Thursday, August 17, 2017, 15:34 [IST]