For Quick Alerts
For Daily Alerts
సెన్సెక్స్ 322 పాయింట్ల లాభంలో...
మునుపటి నష్టాలను కాస్త కవర్ చేస్తూ బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా సాగాయి. జులై 10 తర్వాత ఒక రోజులో ఎక్కువ శాతం లాభపడ్డాయి.
|
మునుపటి నష్టాలను కాస్త కవర్ చేస్తూ బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల దిశగా సాగాయి. జులై 10 తర్వాత ఒక రోజులో ఎక్కువ శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 321.86 పాయింట్లు(1.02%) లాభపడి 31,770.89 వద్ద ముగియగా, నిఫ్టీ 103.15(1.05%) పాయింట్లు పుంజుకుని 9897.30 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎమ్సీజీ(2.94%), లోహ రంగం(1.72%), ఆటో(1.62%), బ్యాంకింగ్(1.26%) లాభపడగా; ఇన్ఫ్రా(0.18%), క్యాపిటల్ గూడ్స్(0.13%) రంగాలు నష్టపోయాయి.
సెన్సెక్స్లో టాటా మోటార్స్(3.57%), సిప్లా(3.54%), ఐటీసీ(3.01%), హెచ్యూఎల్(3.00%), సన్ ఫార్మా(2.69%) లాభపడగా; ఎన్టీపీసీ(1.05%), ఏసియన్ పెయింట్స్(0.94%), పవర్ గ్రిడ్(0.81%), సిప్లా(0.67%), లుపిన్(0.56%) నష్టపోయాయి.
Comments
English summary
సెన్సెక్స్ 322 పాయింట్ల లాభంలో... | sensex gained 322 points
Story first published: Wednesday, August 16, 2017, 17:22 [IST]