అయితే అందరూ ఎక్కువ రేట్లు పెట్టి స్మార్ట్ఫోన్లు కొనేందుకు స్తోమత ఉండటం లేదు. సరిగ్గా అక్కడే ఏం చేయాలని రిలయన్స్ జియో ఆలోచించింది. ఆ తర్వాత విశ్లేషించి ఏం చేసిందో కింద తెలుసుకుందాం.
దేశ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో రాక తర్వాత 4జీ వాడకంలోనూ, మొబైల్ వాడకంలోనూ, డేటా వాడకంలోను చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు చాలా మంది 1జీబీ డేటా అంటే ఒక నెల వరకూ అతి జాగ్రత్తగా వాడుకునేవారు. ఇప్పుడు ఒక రోజుకు ఒక జీబీ డేటా సరిపోవడం లేదు. ఈ ప్రధాన మార్పుకు కారణం వీడియోలు ఎక్కువగా చూడటానికి అలవాటు పడటం. అయితే అందరూ ఎక్కువ రేట్లు పెట్టి స్మార్ట్ఫోన్లు కొనేందుకు స్తోమత ఉండటం లేదు. సరిగ్గా అక్కడే ఏం చేయాలని రిలయన్స్ జియో ఆలోచించింది. ఆ తర్వాత విశ్లేషించి ఏం చేసిందో కింద తెలుసుకుందాం.

1. తక్కువ ధరలో ఎల్టీఈ ఫోన్లు
స్మార్ట్ఫోన్లలో ఎల్టీఈ టెక్నాలజీ ఈ మధ్యనే భారతదేశంలోకి వచ్చింది. ఈ టెక్నాలజీ ఉన్న ఫోన్ల ద్వారా డేటా ఉపయోగించి ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. దాన్నే ప్రధాన ఆయుధంగా జియో ఎంచుకుంది. తక్కువ రేట్లలో ఎల్టీఈ,వీఓఎల్టీఈ ఫోన్లను తయారుచేయించే పనిలో పడింది.

2. రూ.1000 నుంచి రూ.1500 లోపే
దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది స్మార్ట్ఫోన్లలో 2జీ ఫోన్లే వాడుతున్నారు. వారిననే లక్ష్యంగా జియో ముందుకు సాగుతోంది. ఇదివరకే స్మార్ట్ఫోన్ వాడేవారంత 4జీ లోకి రావాలనేది ప్రణాళిక. వచ్చే రెండేళ్లలో రూ.1000 నుంచి రూ.1500 ధర లోపు 20 కోట్ల ఫోన్లను అమ్మాలని రిలయన్స్ లక్ష్యిస్తోందని పీటీఐ వార్తా కథనం వెలువరించింది.

3. ఈ ఫోన్లు ఎప్పుడు వస్తున్నాయి?
ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్బంగా ఆగస్టు 15న కొత్త ఫోన్ అమ్మకాలు మొదలుపెడతామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆగస్టు రెండో వారంలో కంపెనీ ఆ ఫోన్లను ప్రవేశపెడతామని కంపెనీ సైతం తెలిపింది. అయితే ఈ ఫోన్లు రిలయన్స్ రిటైల్ ద్వారా లేదా జియో ద్వారా అమ్ముతారనే విషయం ఇంకా తెలియదు.

4. ధర సంగతి, ఫోన్లో ఏముంటాయి?
ఇప్పుడు కనీసం 4 నుంచి 5 వేలు ఖర్చు చేస్తేనే మంచి స్మార్ట్ఫోన్ వస్తున్నది. అయితే గ్రామీణ ప్రజలు, పట్టణ మధ్య తరగతి ఇంత పెట్టి 4జీ ఉన్న స్మార్ట్ఫోన్ కొనేందుకు మొగ్గుచూపరు. అందుకే రిలయన్స్ తక్కువ ధరలో ఫోన్ ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఒక్కో ఫోన్ ధర రూ.1000 నుంచి రూ.1500 మధ్య ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు చెప్పారు. ఈ తక్కువ ధర 4జీ ఫోన్లో జియో టీవీ, జియో మనీ వంటి ప్రీ లోడెడ్ యాప్లు ఉంటాయి.

5. లక్ష్యం 2జీ యూజర్లేనా...
ఖరీదైన స్మార్ట్ఫోన్లు కొనలేక, కాల్ రేట్లకు ఎక్కువ చెల్లించే 2జీ వినియోగదారులపై రిలయన్స్ జియో కన్నేసినట్లు టెలికాం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫోన్ల తయారీకి సంబంధించి రెండు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఫోక్స్కాన్, ఇంటెక్స్ ఫోన్లను దిగుమతి చేసుకునే ఆలోచన ఉన్నా భవిష్యత్తులో ఇక్కడే తయారీ జరిగే విధంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

6. మొదట కోటితో మొదలు... మొత్తం లక్ష్యం 20 కోట్లు
మొదట ప్రాథమిక దశలో 1 కోటి ఫోన్లను దిగుమతి చేసుకుని అమ్మే విధంగా ప్లాన్ ఉంది. ఫోన్లు అమ్మడం ప్రారంభమైన తర్వాత మొదటి ఏడాది కాలంలో 10 కోట్ల ఫోన్లను, ఆ తర్వాతి సంవత్సరం మరో 10 కోట్ల ఫోన్లను అమ్ముతారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతినిధులు చెప్పారు.

7. పరిశ్రమ గణాంకాలు
ఇండియన్ సెల్యూలార్ అసోషియేషన్ ప్రభుత్వానికి ఫోన్ల మార్కెట్పై ఒక నివేదిక సమర్పించింది. దాని ప్రకారం 2016లో 28 కోట్లుగా మొబైల్ ఫోన్ మార్కెట్ 2018 నాటికి 32 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications