For Quick Alerts
For Daily Alerts
వరుసగా నాలుగో రోజూ నష్టాలే...
అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. అమెరికా-ఉత్తర కొరియా మధ్య ఉన్న ఉద్రిక్తతలతో పాటు, టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచానాలను అందుకోలేకపోవడం మార్కెట్లు ప
|
అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. అమెరికా-ఉత్తర కొరియా మధ్య ఉన్న ఉద్రిక్తతలతో పాటు, టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచానాలను అందుకోలేకపోవడం మార్కెట్లు పడిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. దీంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 266.51 పాయింట్లు కోల్పోయి 31,531 వద్ద ముగియగా, నిఫ్టీ 87.8 పాయింట్లు దిగజారి 9820 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(5.12%), హెల్త్ కేర్(3.15%), ఆటో(2.79%), పవర్(2.78%) నష్టపోగా, మరో వైపు ఐటీ రంగం(0.63%), టెక్నాలజీ(0.13%) లాభపడిన వాటిలో ఉన్నాయి.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో ఇన్ఫోసిస్(1.35%), విప్రో(0.44%), టీసీఎస్(0.37%), ఎల్ అండ్ టీ(0.3%), ఎమ్ అండ్ ఎమ్(0.26%) ఉండగా, మరో వైపు టాటా మోటార్స్(8.6%), డాక్టర్ రెడ్డీస్(4.77%), సన్ ఫార్మా(3.08%), అదానీ పోర్ట్స్(2.66%), సిప్లా(2.47%) నష్టాలకు గురైన వాటిలో ఉన్నాయి.
Comments
English summary
వరుసగా నాలుగో రోజూ నష్టాలే... | Nifty Falls For Fourth Day investors on profit booking
Story first published: Thursday, August 10, 2017, 17:14 [IST]