For Quick Alerts
For Daily Alerts
ఉత్సాహంగా మొదలై.. నీరసంగా ముగిసి
ఉదయం ఉత్సాహంగానే ప్రారంభమైన మార్కెట్లు చివరికి నష్టాలతోనే ముగిశాయి. బోగస్ కంపెనీల విషయమై లిస్టెడ్ కంపెనీలపై సెబీ కొన్ని నిషేధాజ్ఞలు విధించడంతో మార్కెట్లకు షాక్ తగిలింది.
|
ఉదయం ఉత్సాహంగానే ప్రారంభమైన మార్కెట్లు చివరికి నష్టాలతోనే ముగిశాయి. బోగస్ కంపెనీల విషయమై లిస్టెడ్ కంపెనీలపై సెబీ కొన్ని నిషేధాజ్ఞలు విధించడంతో మార్కెట్లకు షాక్ తగిలింది. ఈ నిర్ణయం ప్రభావం మార్కెట్లను తాకినప్పటి నుంచి చివరిదాకా నష్టాల్లోనే కొనసాగాయి. మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 259 పాయింట్లు నష్టపోయి 32,014 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 9979 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(4.22%), చమురు,సహజ వాయు(1.99%), పీఎస్యూ(1.97%), పవర్(1.97%) పడిపోగా, కేవలం లోహ రంగం మాత్రం 1.62% పుంజుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్లో కంపెనీల వారీగా చూస్తే డాక్టర్ రెడ్డీస్(5%), కోల్ ఇండియా(2.79%), ఐటీసీ(2.21%) ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1.82%), పవర్ గ్రిడ్(1.7%) నష్టపోగా; మరో వైపు లాభపడిన వాటిలో టాటా స్టీల్(2.48%), సిప్లా(2.42%), బజాజ్ ఆటో(0.97%), హెచ్యూఎల్(0.24%), అదానీ పోర్ట్స్(0.23%) ఉన్నాయి.
Comments
English summary
ఉత్సాహంగా మొదలై.. నీరసంగా ముగిసి | Indices slipped as sebi is cracking shell companies
Story first published: Tuesday, August 8, 2017, 16:27 [IST]