For Quick Alerts
For Daily Alerts
పెరిగిన ఐటీ రిటర్నులు
గతేడాదితో పోలిస్తే దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య 25 శాతం మేర పెరిగిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 5 నాటికి 2.82 కోట్లు రిటర్నులు దాఖలయ్యాయని, అదే సమయంలో గతేడాది ఆ సంఖ్య 2.26కోట్లు మాత్రమే
|
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకుంటున్న చర్యలు సానుకూల ఫలితాలిచ్చేలా కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య 25 శాతం మేర పెరిగిందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 5 నాటికి 2.82 కోట్లు రిటర్నులు దాఖలయ్యాయని, అదే సమయంలో గతేడాది ఆ సంఖ్య 2.26కోట్లు మాత్రమేనని కేంద్రం పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆగస్టు 5ను రిటర్నుల దాఖలుకు చివరి తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
'పెద్దనోట్ల మార్పిడి, ఆపరేషన్ క్లీన్మనీ ప్రభావంతో ఆదాయపు పన్ను రిటర్నుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆగస్టు 5 నాటికి 2,82,92,955 రిటర్నులు దాఖలయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 2,26,97,843 గా ఉంది. రిటర్నులు దాఖలు చేయడంలో గతేడాది 9.9 శాతం పెరుగుదల కనిపించగా.. ఈ సారి 24.7 శాతం పెరుగుదుల కనిపించింది' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో పాటు వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపు దారుల సంఖ్య కూడా 25.3 శాతం పెరిగిందని తెలిపింది. ఈ ఏడాది 2.79 కోట్లు రిటర్నులు అందాయని తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత పన్ను పరిధిలోకి కొత్తగా వచ్చారనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
English summary
పెరిగిన ఐటీ రిటర్నులు | Income Tax Return Filings Grow 25 percent this time
Story first published: Tuesday, August 8, 2017, 14:57 [IST]