For Quick Alerts
For Daily Alerts
వ్యాపారుల జీఎస్టీ రిటర్నుల సమర్పణ ఆగస్టు 5 నుంచి మొదలు
వ్యాపారులు ఆగస్టు 5 నుంచి జీఎస్టీలో మొదటిసారి రిటర్నులు ఫైల్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 లోపు పన్ను రిటర్ను
|
వ్యాపారులు ఆగస్టు 5 నుంచి జీఎస్టీలో మొదటిసారి రిటర్నులు ఫైల్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 లోపు పన్ను రిటర్నులను సమర్పించేందుకు అవకాశం ఇచ్చినట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో నవీన్ కుమార్ చెప్పారు. వ్యాపారస్తులందరికీ సులువుగా ఉండేందుకు మొదటి రెండు నెలల్లో స్వయం మదింపు ఆధారంగా పన్ను రిటర్నులను చేసేందుకు వీలు కల్పించారు. కాబట్టి జులై, ఆగస్టు నెలలకు సంబంధించి జీఎస్టీఎన్ పోర్టల్లో జీఎస్టీఆర్ 3బీ ఫారం నింపితే సరిపోతుంది.
జులై నెలలో చేసిన వ్యాపారానికి సంబంధించి వచ్చిన ఆదాయ వివరాలను పన్ను రిటర్నుల్లో వెల్లడించాలి. వారంతా ఆగస్టు 20 లోపు ఈ పని పూర్తిచేయాలని నవీన్ చెప్పారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో భాగంగా ఆగస్టు 5 నాటికి ఫారం జీఎస్టీఆర్ 3బీని సిద్దం చేయనున్నట్లు పీటీఐకి వెల్లడించారు. అదే విధంగా పన్ను చెల్లింపులకు వీలుగా జీఎస్టీఎన్ 25 బ్యాంకులతో జట్టు కట్టగా, వ్యాపారులు వీటిలో ఎక్కడైనా పన్ను చెల్లింపుకు అవకాశం కల్పించారు.
Comments
English summary
వ్యాపారుల జీఎస్టీ రిటర్నుల సమర్పణ ఆగస్టు 5 నుంచి మొదలు | businesses start filing July returns on GSTN from Aug 5
Story first published: Friday, August 4, 2017, 14:51 [IST]