త్వరలో పతంజలి బ్రాండెడ్ దుస్తులు
వినియోగదారు మార్కెట్లో చాలా అవకాశమున్న బ్రాండెడ్ వస్త్ర దుకాణ రంగంలోకి పతంజలి వస్తుందని ఇన్ని రోజులు ఊహగానాలున్నా ఇప్పుడు స్పష్టత వచ్చింది. స్వదేశీ బ్రాండ్తో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్
ఇప్పటికే పలు ఎఫ్ంఎసీజీలో అంతర్జాతీయ దిగ్గజాలకు పోటీనిస్తున్న పతంజలి త్వరలో బ్రాండెడ్ దుస్తుల్లోకి సైతం విస్తరించనుంది. ఇప్పటికే ప్యాకేజ్డ్ ఫుడ్, మందులు, కాస్మొటిక్స్, రోజువారీ వినియోగదారు వస్తువులతో మార్కెట్లో విస్తరించిన బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ దేశీయ తయారీకి వీలయ్యే దేన్ని వదిలేలా కనిపించడం లేదు. వినియోగదారు మార్కెట్లో చాలా అవకాశమున్న బ్రాండెడ్ వస్త్ర దుకాణ రంగంలోకి పతంజలి వస్తుందని ఇన్ని రోజులు ఊహగానాలున్నా ఇప్పుడు స్పష్టత వచ్చింది. స్వదేశీ బ్రాండ్తో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ నుంచి మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు అందరికీ సంబంధించి వస్త్ర తయారీతో ఏప్రిల్ చివరి నాటికి అడుగు పెడుతున్నట్లు అధికారిక ప్రతినిధి ఎస్.కే. తిజరావాలా చెప్పారు. ఇందుకోసం మొదటి ఏడాదిలో దాదాపు రూ.5000 కోట్లు ఖర్చు పెట్టేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నారు.
అయితే పతంజలి నుంచి వచ్చే వస్త్ర బ్రాండ్కు సరైన పేరు కోసం వెతుకుతున్నారు. స్వదేశీ ఏజెండాతో వచ్చే దీనికి పరిధన్ అనే ఒక పేరును ఎంచుకున్నప్పటికీ, ఒకటి కంటే ఎక్కువ బ్రాండ్ పేర్లతో కూడా మార్కెట్లోకి ప్రవేశించొచ్చని తిజరావాలా వెల్లడించారు.