239 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
నష్ట భయాలు స్టాక్ మార్కెట్లను రెండో రోజూ వెన్నాడాయి. ఆర్బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ పాలసీ ప్రభావం పడే రంగాలైన బ్యాంకింగ్
నష్ట భయాలు స్టాక్ మార్కెట్లను రెండో రోజూ వెన్నాడాయి. ఆర్బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ పాలసీ ప్రభావం పడే రంగాలైన బ్యాంకింగ్, స్థిరాస్తి, లోహ రంగాల వెనుకడుగుతో ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 238.86 పాయింట్లు కోల్పోయి 32,237.78 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 67.85 పాయింట్లు తగ్గి 10,013.65 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే కన్సూమర్ డ్యూరబుల్స్ తప్ప అన్ని నష్టపోయాయి. లోహ రంగం(1.68%), బ్యాంకింగ్(1.66%), హెల్త్కేర్(1.03%), స్థిరాస్తి(0.73%) బాగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరో వైపు చమురు,సహజ వాయు రంగం(1.35%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.11%) పైకి ఎగశాయి.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే భారతీ ఎయిర్టెల్(2.01%), రిలయన్స్(1.38%), బజాజ్ ఆటో(1.17%), హీరో మోటోకార్ప్(1.02%), టీసీఎస్(0.9%) లాభపడగా; మరో వైపు నష్టపోయిన వాటిలో లుపిన్(3.8%), కోల్ ఇండియా(3.36%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(2.24%), డాక్టర్ రెడ్డీస్(2.02%), యాక్సిస్ బ్యాంక్(2.01%) ముందున్నాయి.


Click it and Unblock the Notifications