ఇప్పటికైతే నిరుద్యోగ భృతి లభించిన దాఖాలాలే లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయమై మరోసారి అన్నింటినీ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగిత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 34 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కతేల్చింది. ఉపాథి కల్పనా కార్యాలయాల ద్వారా నమోదైన వారు కేవలం 8.80 లక్షల మంది వరకు ఉరడగా, తాజాగా ఇతర సర్వేల్లో తేలిన అరకెల మేరకు 34 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.2వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ మేరకు హామీ నెరవేర్చలేదు. దీనిపై వైకాపా అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏది ఏమైనా ఇప్పటికైతే నిరుద్యోగ భృతి లభించిన దాఖాలాలే లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయమై మరోసారి అన్నింటినీ సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగిత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

34 లక్షల మంది నిరుద్యోగులు
ఇటీవల నిర్వహిరచిన ప్రజా సాధికారత సర్వేలో 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు 34 లక్షల వరకు ఉన్నట్లు తేలింది. 35 ఏళ్లకు మించిన వారు మరో పాతిక వేల మంది వరకు ఉన్నారని గుర్తించారు. నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు ఇటీవల సిద్ధం చేసిన గణాంకాల్లో సుమారు తొమ్మిది లక్షల మందే నిరుద్యోగులున్నట్లు ప్రకటించారు.

ప్రజా సాధికారత సర్వే ద్వారా
వాస్తవానికి భారీ సంఖ్యలో ఏ పని లేని వారున్నట్లు స్పష్టమవుతోరది. అందుకే ఇటీవల చేసిన ప్రజాసాధికారత సర్వే గణాంకాల్ని వెలికి తీసి, వాటిల్లో ఉన్న నిరుద్యోగుల వివరాల్ని క్రోడీకరించగా, దాదాపు 34 లక్షల మంది ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలురటాయని భావిస్తున్నారు. సర్వే లెక్కల మేరకు ఉన్న 34 లక్షల మంది నిరుద్యోగుల్లో అట్టడుగు వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.

వర్గాల వారీగా...
ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన వారు 24 లక్షల మంది ఉరడగా, ఇతర కులాలకు చెరదిన వారు 10 లక్షల మంది వరకు ఉన్నట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి.

ఏ వయసులో నిరుద్యోగిత ఎలా?
అలాగే ఇంటర్, డిగ్రీ చదివిన వారే ఎక్కువ నిరుద్యోగులుగా కనిపిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే 35 ఏళ్ల లోపు వయసున్న నిరుద్యోగులు 34 లక్షల మంది, 35 నుంచి 40 మధ్య వయసున్న వారు 13 వేల మంది, 40 నురచి 45 మధ్య ఉన్న వారు 10 వేల మంది, అంతకన్నా ఎక్కువ వయసున్న నిరుద్యోగులు 17 వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు.

16 లక్షల మంది బీసీ నిరుద్యోగులు
మొత్తం నిరుద్యోగుల వివరాల్ని పరిశీలిస్తే 35 ఏళ్లలోపు ఉన్న వారిలో అత్యధికంగా బిసి నిరుద్యోగులు 16 లక్షల వరకు ఉరడగా, ఎస్సీలు 6 లక్షల మంది, గిరిజనులు 1.40 లక్షల మంది ఉన్నారు.

12 లక్షల మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు
విద్యార్హతల వారీగా చూస్తే అత్యధికంగా 12 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇంటర్ చదివిన వారు 10.45 లక్షల మంది ఉండగా, పదో తరగతి అర్హత కలిగిన వారు 6.25 లక్షల మంది, పాలిటెక్నిక్, ఐటిఐ వంటి సాంకేతిక అర్హతలు కలిగిన వారు 2.89 లక్షల మంది, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర అర్హతలు కలిగిన వారు మరో 2.07 లక్షల మంది ఉన్నట్లు సర్వేలో తేలింది.

7. నిరుద్యోగిత ఎందుకు పెరుగుతోంది?
ఇంటర్ వరకు చదివి మానేసిన 10.45 లక్షల నిరుద్యోగుల్లో కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే అధికంగా కనిపిస్తున్నారు. వారిలో బిసిలు 5.08 లక్షలు, ఎస్సీలు 2.06 లక్షలు, ఎస్టీలు 51 వేల మంది ఉన్నారు. వీరంతా చాలాకాలంగా ఉద్యోగాలు లేక సతమతమవుతున్న వారే కావడం విశేషం. నేరుగా ఉద్యోగాలు లేకపోయినా, కనీసం స్వయం ఉపాథి కార్యక్రమాలు కూడా దరి చేరకపోవడం వల్ల నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications