అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
వారాంతంలో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత నాలుగు సెషన్లలో రికార్డు స్థాయిలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలకు గురయ్యాయి. మధ్యాహ్నం సెషన్ నుంచి ఊపందుకున్న అమ
వారాంతంలో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత నాలుగు సెషన్లలో రికార్డు స్థాయిలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలకు గురయ్యాయి. మధ్యాహ్నం సెషన్ నుంచి ఊపందుకున్న అమ్మకాల కారణంగా బాగా నష్టాల్లోకి వెళ్లిన మార్కెట్లు తర్వాత కాస్త కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73.42 పాయింట్లు నష్టపోయి 32,309.88 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 6.05 పాయింట్లు దిగజారి 10,014.50 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సూచీలో హెల్త్కేర్(1.73%), లోహ రంగం(1.39%), స్థిరాస్తి(0.67%), మూలధన వస్తువులు(0.61%) నష్టపోగా, మరో వైపు ఐటీ(1.05%), టెక్నాలజీ(0.8%), ఎఫ్ఎంసీజీ(0.23%), వాహన రంగం(0.21%) లాభపడ్డాయి.

బీఎస్ఈ సెన్సెక్స్లో నష్టపోయిన వాటిలో డాక్టర్ రెడ్డీస్(6.08%), లుపిన్(4.34%), సన్ ఫార్మా(3.89%), ఐసీఐసీఐ బ్యాంక్(3.6%), హీరో మోటోకార్ప్(2.04%) ముందుండగా; మరో వైపు హెచ్డీఎఫ్సీ(3.2%), ఇన్ఫోసిస్(2.63%), ఐటీసీ(0.9%), అదానీ పోర్ట్స్(0.9%), ఓఎన్జీసీ(0.76%) లాభపడిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications