సీనియర్ సిటిజన్ల కోసం వయ వందన యోజన
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాన మంత్రి వయ వందన యోజన అనే పెన్షన్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇది కేవలం సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ఇ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాన మంత్రి వయ వందన యోజన అనే పెన్షన్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇది కేవలం సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ఇతర బీమా కంపెనీ కన్నా ఎల్ఐసీ క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎక్కువని జైట్లీ అన్నారు. ఎల్ఐసీ ఈ పథకం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా 58,152 లబ్దిదారుల ద్వారా రూ. 2705 కోట్లను సేకరించారు. ఈ పథకం ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి వయ వందన యోజన: 10 ముఖ్య విషయాలు
1. మే 4, 2017న ప్రారంభించిన ఈ పథకం మే 3,2018 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి కలిగే అధిక వడ్డీ భారాన్ని కేంద్రం ఎల్ఐసీకి చెల్లిస్తుంది.
2. ఎల్ఐసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ లేదా కార్యాలయంలో దరఖాస్తు నింపి ఆఫ్లైన్లో ఈ పథకంలో చేరవచ్చు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఎల్ఐసీ మాత్రమే నిర్వహిస్తుంది.
3. ఈ పథకంలో వార్షిక వడ్డీ రాబడి కనీసం 8% వచ్చేలా చూస్తారు. నెలవారీ చెల్లింపే 8% వడ్డీ రూపంలో వచ్చేలా చేసే ఈ పథకంలో వార్షిక వడ్డీ దాదాపు 8.30% వచ్చే అవకాశం ఉంది.(10 ఏళ్ల పాటు)
4. పెన్షన్ను నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, ఏటా ఒకసారి చెల్లించే ఏర్పాటు ఉంది. పాలసీదారు ఇష్టాన్ని బట్టి కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
5. ఈ పథకంలో నెలకు కనీసం రూ.1000 పింఛను కావాలంటే రూ.1.5 లక్షలు, గరిష్టంగా రూ.5000 పింఛను కావాలంటే రూ.7,50,000 పెట్టుబడి పెట్టాలి.
6. పింఛనుదారు పాలసీ మొదలుపెట్టిన కాలం నుంచి చివరి వరకూ ఉంటే, 10 ఏళ్ల పాటు ఏటా పింఛను చెల్లిస్తూ కొనుగోలు విలువను సైతం వెనక్కు చెల్లిస్తారు.
7. గడువు లోపు పింఛనుదారు చనిపోతే పెట్టిన పెట్టుబడిని లబ్దిదారుల వారసులకు చెల్లిస్తారు. మధ్యలోనే పించనుదారు లేదా జీవిత భాగస్వామి తీవ్రమైన వ్యాధుల బారిన పడతే పెట్టిన పెట్టుబడిలో 98% తిరిగి చెల్లిస్తారు.
8. పాలసీ మొదలైన మూడేళ్ల కాలం నుంచి ఖర్చుల కోసం పాలసీ విలువలో 75% వరకూ
రుణం పొందవచ్చు. రుణ వడ్డీని పింఛను వాయిదాల నుంచి ఎల్ఐసీ రాబట్టుకుంటుంది. మిగిలిన రుణాన్ని క్లెయిం సొమ్ము నుంచి తీసుకుంటారు.
9. సీనియర్ సిటిజన్ పొదుపు పథకం లాగే ఇది ఒక మంచి పథకమని దీనిని 60 ఏళ్లు అంతకు మించి వయసు ఉన్నవారు ఉపయోగించుకోవాలని అవుట్లుక్ సీఈవో మనోజ్ నాగ్పాల్ చెప్పారు.
మధ్యలో ఎక్కువ డబ్బు అవసరం లేకుండా నెలవారీ పింఛను అందుకుంటే చాలనుకునే వయోవృద్దులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
10. అన్ని రకాల సేవా పన్నుల నుంచి ఈ పథకానికి మినహాయింపును ఇచ్చారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications