సెన్సెక్స్ 32,000.. నిఫ్టీ 9900 దాటేశాయ్
లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి ఊపందుకున్న కొనుగోళ్లతో జోరందుకున్నాయి. సెన్సెక్స్ 32,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,900 స్థాయిని దాట
* 124 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి ఊపందుకున్న కొనుగోళ్లతో జోరందుకున్నాయి. సెన్సెక్స్ 32,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,900 స్థాయిని దాటేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 122 పాయింట్లు పెరిగి 32,027కు చేరింది. నిఫ్టీ సైతం 31 పాయింట్లు పుంజుకుని 9,905 వద్ద కదులుతోంది.

ఐటీ రంగం సానుకూలం
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ రంగం 2 శాతం జంప్ చేయడంతో మార్కెట్లకు బలమొచ్చింది. దీనికి హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ జతకలిసింది. అయితే ఫార్మా, మెటల్, రియల్టీ రంగాలు 0.7-0.4 శాతం మధ్య నీరసించి మార్కెట్లను వెనక్కిలాగుతున్నాయి.
సెన్సెక్స్ కంపెనీలు
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో విప్రో(6.47%), రిలయన్స్(3.76%), కోల్ ఇండియా(2.66%), టీసీఎస్(1.87%), కొటక్ బ్యాంక్(1.86%)లాభాల్లో నిలవగా; మరో వైపు భారతీ ఎయిర్టెల్(2.05%), లుపిన్(1.99%), పవర్ గ్రిడ్(1.85%), హీరో మోటోకార్ప్(1.34%), సిప్లా(0.96%) నష్టపోయిన వాటిలో ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications