జియో ఫోన్ బుకింగ్ ఎలా?
జియో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా జియో ఉచిత ఫోన్ను లాంచ్ చేశారు. దీన్ని బుక్ చేయాలంటే ఎలానో తెలుసుకుందాం.
జియో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా జియో ఉచిత ఫోన్ను లాంచ్ చేశారు. దీన్ని బుక్ చేయాలంటే ఎలానో తెలుసుకుందాం.
ముకేశ్ అంబానీ ప్రకటించిన చౌక ఫోన్ కావాలంటే ప్రీబుకింగ్ తప్పనిసరి.ఈ బుకింగ్ ఆగస్టు 24 నుంచి మొదలవుతుంది. ఉచిత ఫోన్ కావాలనుకున్న వారు రెండు విధాలుగా దీన్ని పొందవచ్చు. అయితే దీనికి రూ.1500 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. దీన్ని మళ్లీ 3 సంవత్సరాల తర్వాత వెనక్కి ఇస్తారు.బుకింగ్ కోసం దగ్గర్లో ఉన్న జియో రిటైలర్ వద్ద లేదా మైజియో యాప్ ద్వారా చేయవచ్చు. రూ.1500 కేవలం సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమేనని ముకేశ్ అంబానీ చెప్పారు. డేటాను ఎవరూ దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఈ విధంగా చేస్తున్నామన్నారు. ఇండియాలో విడుదల చేస్తున్న ఈ జియో ఫోన్ను భారత ఇంజినీర్లే తయారు చేసారని వెల్లడించారు. ప్రతి వారం రోజులకు 50 లక్షల ఫోన్లు అందుబాటులో ఉంటాయన్నారు.