For Quick Alerts
For Daily Alerts
242 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ సూచీల్లో సానుకూల స్పందన కనిపించింది. దీంతో ఈ రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 242 పాయింట్లు లాభపడి 31,952 వద్ద ముగియగా నిఫ్టీ 69 పాయింట్లు పుంజుకుని 9896 వద్ద స్థిరప
|
అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటం దేశీయ మార్కెట్లకు లాభించింది. కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లతో పాటు, ఫార్మా షేర్ల రాణింపుతో దేశీయ సూచీల్లో సానుకూల స్పందన కనిపించింది. దీంతో ఈ రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 244 పాయింట్లు లాభపడి 31,955 వద్ద ముగియగా నిఫ్టీ 72 పాయింట్లు పుంజుకుని 9899 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.87%), హెల్త్కేర్(1.75%), స్థిరాస్తి(1.58%), ఎఫ్ఎంసీజీ(1.53%) రాణించాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో భారతీ ఎయిర్టెల్(3.22%), ఐటీసీ(2.44%), కోల్ ఇండియా(2.19%), డాక్టర్ రెడ్డీస్(1.96%), టీసీఎస్(1.85%) ముందుండగా, మరో వైపు నష్టపోయిన వాటిలో ఇన్ఫోసిస్(0.61%), హెచ్యూఎల్(0.49%), అదానీ పోర్ట్స్(0.37%), హీరో మోటోకార్ప్(0.26%), ఐసీఐసీఐ బ్యాంకు(0.15%) ఉన్నాయి.
Comments
English summary
242 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ | bse Sensex closed higher by nearly 250 points
Story first published: Wednesday, July 19, 2017, 16:39 [IST]