దేశీయ సూచీలు రికార్డు ముగింపుల దిశగా
మార్కెట్లు మళ్లీ లాభాల సునామీని చూశాయి. సెన్సెక్స్ కొత్త గరిష్టాల వద్ద ముగిసింది. సూచీలు రెండు జీవన కాల గరిష్టాలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్లు లాభపడి 32,075 వద్ద ముగియగా; మరో సూచ
మార్కెట్లు మళ్లీ లాభాల సునామీని చూశాయి. సెన్సెక్స్ కొత్త గరిష్టాల వద్ద ముగిసింది. సూచీలు రెండు జీవన కాల గరిష్టాలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్లు లాభపడి 32,075 వద్ద ముగియగా; మరో సూచీ నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకొని 9915.95 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(1.28%), లోహ రంగం(0.97%), ఐటీ(0.95%), టెక్నాలజీ(0.89%) లాభపడగా, మరో వైపు ఎఫ్ఎంసీజీ(1.54%), క్యాపిటల్ గూడ్స్(0.07%) నష్టపోయాయి.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో విప్రో(3.12%), అదానీ పోర్ట్స్(1.81%), ఐసీఐసీఐ బ్యాంకు(1.69%), సిప్లా(1.56%), ఇన్ఫోసిస్(1.37%) ముందుండగా, నష్టపోయిన వాటిలో ఐటీసీ(3.4%), కోల్ ఇండియా(1.34%), డాక్టర్ రెడ్డీస్(0.72%), యాక్సిస్ బ్యాంకు(0.42%), మారుతి(0.41%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications