For Daily Alerts
రూ.190 పెరిగిన బంగారం ధర
దేశ రాజధాని ఢిల్లీలో 99.9% స్వచ్చత గల బంగారం ధర రూ.29,050కు చేరగా, 99.5% స్వచ్చత గల బంగారం రూ. 28,900గా ఉంది. వెండి ధర కేజీ రూ.38వేలుగా పలుకుతోంది.
|
గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర శనివారం పుంజుకుంది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.190 పెరిగి రూ.29వేలను దాటేసింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటం ధర పెరగడానికి కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
బంగారం ధర శనివారం నాటి ట్రేడింగ్లో రూ.29,050కు చేరింది.మరోవైపు వెండి కూడా రూ.38వేల మార్కును దాటింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఏర్పడటంతో వెండి ధర తిరిగి బలం పుంజుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా బంగారం ధర 0.91శాతం పెరిగి ఔన్సు 1,228.40 డాలర్లకు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 99.9% స్వచ్చత గల బంగారం ధర రూ.29,050కు చేరగా, 99.5% స్వచ్చత గల బంగారం రూ. 28,900గా ఉంది. వెండి ధర కేజీ రూ.38వేలుగా పలుకుతోంది.
Comments
English summary
రూ.190 పెరిగిన బంగారం ధర | gold rate increase by Rs 190 on Saturday
Story first published: Saturday, July 15, 2017, 16:53 [IST]