2000 మందిని నియమించుకోనున్న పేటీఎమ్
తన వ్యాపారం, సాంకేతిక నిర్వహణ కోసం పేటీఎమ్ మాల్ దాదాపు కొత్తగా 2000 మందిని నియమించుకోనున్నట్లు సమాచారం. పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్. పేటీఎమ్ ఇటీవలే వన్97 నుంచి వేరుగా ఈ-కామర
తన వ్యాపారం, సాంకేతిక నిర్వహణ కోసం పేటీఎమ్ మాల్ దాదాపు కొత్తగా 2000 మందిని నియమించుకోనున్నట్లు సమాచారం. పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్. పేటీఎమ్ ఇటీవలే వన్97 నుంచి వేరుగా ఈ-కామర్స్ వ్యవహారాల కోసం పేటీఎమ్ మాల్ను ఏర్పాటు చేసింది. తర్వాత వన్97 కమ్యూనికేషన్స్ నుంచి దాదాపు 800 మంది ఉద్యోగులను పేటీఎమ్ మాల్కు మార్చింది. సైఫ్ పార్ట్నర్స్ , అలీబాబా గ్రూప్ నుంచి దాదాపు 200 మిలియన్ డాలర్లను పేటీఎమ్ మాల్ సేకరించింది.
ఉద్యోగుల నియామకం తర్వాత వారంతా వివిధ కేటగిరీల్లో కంపెనీ పనులను చేపడతారు. "వినియోగదారులకు స్మార్ట్ఫోన్ నుంచే ఎన్నో వస్తువులకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతాం. వీటిని ఆన్లైన్, ఆఫ్ లైన్ మార్గాల్లో అమ్మేందుకు ప్రయత్నిస్తాం" అని పేటీఎమ్ మాల్ సీవోవో అమిత్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.