For Quick Alerts
For Daily Alerts
ఆంధ్రా బ్యాంకులో సిరీస్-2 గోల్డ్ బాండ్లు
ఆంధ్రా బ్యాంకు ఈ రోజు నుంచి జులై 14 వరకూ దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ సార్వభౌమ బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాండ్లను మన దేశ పౌరులకు, సంస్థలకు, ట్రస్టులకు, విశ్వవిద్యాలయాల
|
ఆంధ్రా బ్యాంకు ఈ రోజు నుంచి జులై 14 వరకూ దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ సార్వభౌమ బంగారు బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాండ్లను మన దేశ పౌరులకు, సంస్థలకు, ట్రస్టులకు, విశ్వవిద్యాలయాలకు, దాతృత్వ సంస్థలకు మాత్రమే ఇస్తారు. దరఖాస్తు చేసిన వారికి కనీసం 1 గ్రాము నుంచి 5000 గ్రాముల బంగారు బాండ్లను అర్హతను బట్టి కేటాయిస్తారు.
బాండ్ కాలపరిమితి 8 ఏళ్లు ఉంటుంది. 5 ఏళ్లు పూర్తయిన నుంచి ముందస్తు ముగింపుకు అవకాశం కల్పిస్తారు. 5 ఏళ్ల వరకు బాండ్లను వెనక్కు ఇచ్చే వీల్లేదు. నామమాత్ర విలువను పరిగణనలోకి తీసుకుని మొదటిసారి పెట్టుబడి పెట్టిన వారికి 2.50% వార్షిక వడ్డీని ఇస్తున్నట్లు ఆర్బీఐ నోటిఫికేషన్ తెలిపింది. ప్రతివారం ఇండియన్ బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ ప్రకటించే ముగింపు ధర ఆధారంగా సగటును లెక్కించి ఒక విలువను నిర్ణయిస్తారు. నామినల్ ప్రైస్ కంటే రూ.50 తక్కువగా బాండ్ ఇష్యూ ధరను ప్రకటిస్తారు. ఈసారి ఇష్యూ ధరను ఒక్కో గ్రాము బంగారానికి రూ.2780గా నిర్ణయించారు.
Comments
English summary
ఆంధ్రా బ్యాంకులో సిరీస్-2 గోల్డ్ బాండ్లు | andhra bank to sell gold bonds from july 10th
Story first published: Monday, July 10, 2017, 14:16 [IST]