స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
అంతర్జాతీయ కారణాల చేత మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 9 పాయింట్లు తగ్గి 31,360 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 9 పాయింట్లే క్షీణించి 9,666 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ కారణాల చేత మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 9 పాయింట్లు తగ్గి 31,360 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 9 పాయింట్లే క్షీణించి 9,666 వద్ద స్థిరపడింది. అయితే ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 9,684 వద్ద రోజులో గరిష్టాన్నీ, 9,642 వద్ద కనిష్టాన్నీ తాకింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(1.48%), హెల్త్ కేర్(1.03%), చమురు,సహజ వాయు(0.44%), క్యాపిటల్ గూడ్స్(0.15%) లాభపడగా, మరో వైపు ఐటీ రంగం(0.73%), టెక్నాలజీ(0.52%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.37%), ఎఫ్ఎమ్సీజీ(0.36%) నష్టపోయాయి.

సెన్సెక్స్లో లాభపడిన వాటిలో చూస్తే రిలయన్స్(3.43%), లుపిన్(3.28%), డాక్టర్ రెడ్డీస్(1.39%), భారతీ ఎయిర్టెల్(1.07%), సన్ ఫార్మా(0.88%) ఉండగా, మరో వైపు ఐసీఐసీఐ బ్యాంకు(1.28%), యాక్సిస్ బ్యాంక్(1.25%), ఇన్ఫోసిస్(1.21%), ఏసియన్ పెయింట్స్(1.2%), హీరో మోటోకార్ప్(1.11%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications