ఇది వరకే జియో సిమ్తో పాటు జియోఫై పరికరం కొన్నవారికి రిలయన్స్ జియో ఒక ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా దాదాపు 224 జీబీ డేటాను పొందవచ్చు. ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇది వరకే జియో సిమ్తో పాటు జియోఫై పరికరం కొన్నవారికి రిలయన్స్ జియో ఒక ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా దాదాపు 224 జీబీ డేటాను పొందవచ్చు. ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

జియో ఫ్రీ డేటా ఆఫర్, ఎలా తెచ్చుకోవాలి?
ఒకసారి జియో ఫై పరికరం కొన్న తర్వాత జియో సిమ్ను యాక్టివేట్ చేయించుకోవాలి. 99 రూపాయల రీచార్జీ ద్వారా ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాలి. మీ డేటా అవసరాలను బట్టి 4 ఆప్షన్లలో నుంచి ఒకదాన్ని ఎంచుకోవాలి. కొత్త జియో ఫై పరికరం కొని, జియో ప్రైమ్ సభ్యత్వం కలిగిన జియో చందాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.

మొదటి ఆఫర్
రూ.149 రీచార్జీ చేయించుకుంటే 12 నెలల పాటు జియో ప్రతి నెలా 2జీబీ డేటాను అందిస్తుంది. ఇందులో భాగంగా యూజర్లు మొదట రూ.99, రూ. 149 రీచార్జీ ఒకసారి చేయిస్తే వచ్చే 12 నెలల పాటు జియో డేటాను ఉచితంగా వాడుకోవచ్చు.

రెండో ఆఫర్
రూ. 309 పెట్టి రీచార్జీ చేయిస్తే వచ్చే ఆరు నెలల పాటు 1జీబీ డేటా(నెలా నెలా) ఉచితంగా వస్తుంది. తర్వాత ఉండే చెల్లింపు ఆప్షన్ Rs 99 + Rs 309. ఇలా 6 వరుస సార్లు ఈ రీచార్జీ చేయించుకునే వీలుంటుంది. ఏదేమైనా ప్రతి రోజూ 1 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. అంటే ఆఫర్ పీరియడ్లో 168 జీబీ వరకూ డేటా వస్తుంది. ప్రైమ్ మెంబర్ షిప్ ధర తీసివేసి చూస్తే కేవలం రూ.309 రీచార్జీకే 168 జీబీ ప్రయోజనాలు పొందినట్లవుతుంది.

మూడో ఆఫర్
రూ.509 రీచార్జీ చేయిస్తే 4 నెలల పాటు ప్రతి రోజు 2జీబీ డేటా వాడుకునే ఆప్షన్ మూడోది. రీచార్జీ ఆప్షన్ Rs 99 + Rs 509, చేయిస్తే 4 నెలల పాటు నిరంతరాయంగా డేటాను వాడుకోవచ్చు. అంటే ఆఫర్ పీరియడ్ మొత్తం కలిపి 224 జీబీ వస్తుంది. జియో ప్రైమ్ యూజర్లు జియో ఫై పరికరం లేకుండా ఈ డేటాను ఆఫర్గా పొందవచ్చు.

నాలుగో ఆఫర్
ప్రతి నెలా 60జీబీ చొప్పున 4 నెలల పాటు జియో డేటాను వాడుకోవడానికి ఇచ్చిన ఆప్షన్ 999. రూ.999 తో ఒకసారి రీచార్జీ చేయిస్తే ఆ రీచార్జీ 60 రోజుల పాటు పనికొస్తుంది. అంతే కాకుండా రెట్టింపు కాలానికి ఆఫర్ అమలు చేస్తారు. అంటే 120 రోజులు లేదా 4 నెలల పాటు ఒకసారి 999 పెట్టి రీచార్జి చేస్తే చాలు. ఆఫర్లన్నీ ప్రీపెయిడ్ కస్టమర్లను ఉద్దేశించినవి. బిల్ సైకిల్ మాత్రం 28 రోజుల పాటు ఉండి మారుతుంటుంది.

జియో చౌక ఫోన్ రూ.500కే
భారతీయ టెలికాం మార్కెట్లో సంచనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీయనుంది. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సేవలతో టెలికాం దిగ్గజాలకు షాక్ ఇచ్చిన జియో తాజాగా ఫీచర్ ఫోన్ల రంగంలోకి అడుగిడనుంది. అది కూడా అతి తక్కువ ధరలకే (రూ.500) వీవోఎల్టీఈ ఫీచర్తో కూడినది కావడం విశేషం.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications