36 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాహన తయారీ కంపెనీలు ఇచ్చిన మద్దతుతో మార్కెట్లు లాభాలను నిలబెట్టుకున్నాయి. జీఎస్టీని దాదాపుగా మార్కెట్లు స్వాగతించినట్లు కనపడినప్పటికీ కంపెనీల తుది ఫలితాలు ప్రతి
రోజు మొత్తం స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు చివరికి సానుకూలంగా ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాహన తయారీ కంపెనీలు ఇచ్చిన మద్దతుతో మార్కెట్లు లాభాలను నిలబెట్టుకున్నాయి. జీఎస్టీని దాదాపుగా మార్కెట్లు స్వాగతించినట్లు కనపడినప్పటికీ కంపెనీల తుది ఫలితాలు ప్రతిఫలించే రిపోర్టుల మీదే కొత్త పన్ను ప్రభావం ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. జీఎస్టీ సానుకూల ప్రభావం ఇంకా పూర్తిగా కనబడలేదని విశ్లేషకులు చెపుతున్నారు. అన్ని ప్రభావాలతో చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 35.77 పాయింట్లు లాభపడి 31,245.56 వద్ద ముగియగా; నిఫ్టీ 24.30 పాయింట్లు లాభపడి 9637.60 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లుపిన్ అత్యధికంగా దాదాపు 4% లాభపడింది. దీంతో కంపెనీ షేరు ధర రూ.1084కు చేరింది. ప్యాసెంజర్ వాహన ధరలు తగ్గించినట్లు ప్రకటించడంతో టాటా మోటార్స్ షేర్ ధర 1% పెరిగి రూ.433గా ఉంది. జీఎస్టీ ప్రభావంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ ధర 2% పెరిగి రూ.1383కు చేరింది.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో లుపిన్(3.84%), వేదాంత(2.41%), ఎమ్ అండ్ ఎమ్(2.20%), ఓఎన్జీసీ(1.81%), అల్ట్రాటెక్ సిమెంట్(1.71%) ఉండగా ; మరో వైపు నష్టపోయిన వాటిలో ఐటీసీ(1.84%), ఇన్ఫోసిస్(1.17%), విప్రో(0.85%), భారతీ ఎయిర్టెల్(0.79%), హెచ్డీఎఫ్సీ(0.70%) ఉన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications