For Daily Alerts
ఎస్బీఐ నూతన ఛైర్మన్ కోసం వేట
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ చైర్మన్ కోసం ముఖాముఖి ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 6న అరుంధతి భట్టాచార్య పదవీ విరమణ చేయనుండటంతో ఆమె స్థానంలో కొత్త వారిని నియమించడం కోసం ప్ర
|
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ చైర్మన్ కోసం ముఖాముఖి ప్రక్రియ జరుగుతోంది. అక్టోబర్ 6న అరుంధతి భట్టాచార్య పదవీ విరమణ చేయనుండటంతో ఆమె స్థానంలో కొత్త వారిని నియమించడం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతేడాది కొత్తగా నియమంచిన వినోద్ రాయ్ సారథ్యంలోని బ్యాంక్ బోర్డు బ్యూరోకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఏప్రిల్1,2016 న ప్రారంభమైన ఈ బ్యూరో ప్రభుత్వ రంగ బ్యాంకుల బాగు కోసం పనిచేస్తోంది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లు బి.శ్రీరామ్, రజనీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్ గుప్తా, దినేష్ కుమార్ ఖారా ముఖాముఖి ప్రక్రియకు హాజరవుతారని తెలుస్తోంది.
ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం పూర్తయ్యేందుకు గాను గతేడాది అక్టోబర్లో అరుంధతి భట్టాచార్య కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగించారు. ఏప్రిల్ 1,2017 నాటికి ఎస్బీఐ విలీన ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే.
Comments
English summary
ఎస్బీఐ నూతన ఛైర్మన్ కోసం వేట | new sbi chairman interviews are going on
Story first published: Thursday, June 29, 2017, 11:48 [IST]