హాత్వే ఐపీవో ప్రారంభం ఈ రోజే
కేబుల్ టెలివిజన్, బ్రాడ్ బ్యాండ్ సేవల్లో ఉన్న జీటీపీఎల్ హాత్వే లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ జూన్ 21, 2017న ప్రారంభం కానుంది. ఈనెల 23న ముగియనున్న బుక్ బిల్డ్ ఇష్యూ ఐపీఓ ఇష్యూ ధర రూ.167 - ర
కేబుల్ టెలివిజన్, బ్రాడ్ బ్యాండ్ సేవల్లో ఉన్న జీటీపీఎల్ హాత్వే లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ జూన్ 21, 2017న ప్రారంభం కానుంది. ఈనెల 23న ముగియనున్న బుక్ బిల్డ్ ఇష్యూ ఐపీఓ ఇష్యూ ధర రూ.167 - రూ.170 కాగా, కనీస మార్కెట్ లాట్ సంఖ్యను 88 షేర్లుగా నిర్ణయించింది. కేబుల్ టీవీ ఆపరేటర్ జీపీటీఎల్, హాత్వేలు కలిసి 50:50 శాతం వాటాల్లో ఏర్పాటైన సంస్థే జీటీపీఎల్(గుజరాత్ డిజి కామ్ ప్రైవేట్ లిమిటెడ్) హాత్వే.
అనీరుద్దాసిన్హా జడేజా, కనాక్షిన్ రానా జీటీపీఎల్ హాత్వే లిమిటెడ్లో ప్రమోటర్లుగా ఉన్నారు. ఇష్యూ సైజ్ రూ.240 కోట్లు కాగా, రూ.10 ముఖవిలువ కలిగిన ఈ షేర్లను జులై 4, 2017న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ చేయనున్నారు. ఈ సంస్థ వెంచర్ మొత్తం 189 నగరాల్లో సర్వీసులను అందిస్తోంది. జీటీపీఎల్ గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్,రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణను కలిగి ఉంది.
జేఎం ఫైనాన్షియల్ సెక్యూరిటీస్, బీఎన్పీ పారిబస్, మోటిలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, యస్ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా.. లింక్ ఇన్టైం ఇండియా రిజస్ట్రార్గా వ్యవహరిస్తోంది. ఒక్కో ఖాతాదారు నుంచి రూ.472.17 ఆదాయం పొందుతూ జనవరి నెల నాటికి దాదాపు 2,28,217 మంది కస్టమర్లను కలిగి ఉంది.