చైనా సంస్థతో అదానీ గ్రూప్ జట్టు
చైనాలో అతిపెద్ద ప్రయివేటు కంపెనీల్లో ఒకటైన ఈస్ట్ హోప్ గ్రూప్తో అదానీ గ్రూప్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ పోర్టులో తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు రెండు కంపెనీల మధ్య అవగాహన కుదిరింది. షాంఘైలో ఈ ఒప్పందం కుదిరినట్లు భారత కాన్సులేట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
గుజరాత్లోని ముంద్రాలో స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఓ ఉత్పత్తి యూనిట్ను నెలకొల్పేందుకు అంగీకారం కుదిరింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాలు, రసాయనాలు, అల్యూమినియం, పశువుల ఆహారం వంటి ఉత్పత్తుల తయారీకి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. జూన్ 19న ఆదాని పోర్ట్స్ అండ్ సెజ్ అధ్యక్షుడు అమిత్ ఉప్లేంచ్వర్, ఈస్ట్హోస్ట్ గ్రూప్ (ఇన్వెస్ట్మెంట్) అధ్యక్షుడు ఛాంగ్జున్లు కాన్సుల్ జనరల్ ప్రకాశ్గుప్తా సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.