For Daily Alerts
సెన్సెక్స్కు 19 పాయింట్ల నష్టం
బ్యాంకు స్టాక్లు తిరిగి పుంజుకున్నప్పటికీ ఐటీ, ఫార్మా షేర్ల విషయంలో నెలొకొన్న ప్రతికూల ప్రభావాలతో మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 19.33 పాయింట్లు కోల్పోయి 31,056 వద్ద
|
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
బ్యాంకు స్టాక్లు తిరిగి పుంజుకున్నప్పటికీ ఐటీ, ఫార్మా షేర్ల విషయంలో నెలొకొన్న ప్రతికూల ప్రభావాలతో మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 19.33 పాయింట్లు కోల్పోయి 31,056 వద్ద ముగియగా; నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి 9588 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(0.58%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.5%), బ్యాంకింగ్(0.48%), స్థిరాస్తి(0.35%) నష్టపోయాయి. మరో వైపు హెల్త్ కేర్(1.52%) బాగా పడగా; ఐటీ(0.83%), టెక్నాలజీ(0.68%), మూలధన వస్తువులు(0.14%) సైతం నష్టాల బాట పట్టాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడ్డ,నష్టపోయిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి. సెన్సెక్స్లో బాగా లాభపడిన వాటిలో టాటా మోటార్స్(1.57%), ఐటీసీ(1.46%), అదానీ పోర్ట్స్(0.67%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(0.63%), ఎన్టీపీసీ(0.53%) ఉండగా; నష్టపోయిన వాటిలో లుపిన్(4.4%), సన్ ఫార్మా(2.78%), విప్రో(2.24%), సిప్లా(2.2%), ఇన్ఫీ(1.24%) ముందు వరుసలో ఉన్నాయి.
Comments
English summary
సెన్సెక్స్కు 19 పాయింట్ల నష్టం | Sensex ends marginally lower
Story first published: Friday, June 16, 2017, 16:49 [IST]