సీడీఎస్ఎల్ ఐపీవో జూన్ 19న ప్రారంభం
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ప్రమోట్ చేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్ఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణిని రూ. 145-149గా నిర్ణయించే వీలున్నట్లు మార్కెట
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ప్రమోట్ చేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్ఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న మొదలుకానుంది. ఇష్యూకి ధరల శ్రేణిని రూ. 145-149గా నిర్ణయించే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిపాజిటరీ సేవలందించే సీడీఎస్ఎల్ ఈ ఇష్యూ ద్వారా రూ. 1500 కోట్ల నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది.ఐపీవో తరువాత కంపెనీలో బీఎస్ఈ వాటా 24 శాతానికి పరిమితంకానుంది. ప్రస్తుతం బీఎస్ఈకి 50 శాతానికిపైగా వాటా ఉంది.
దేశంలో లిస్టింగ్ అయ్యే తొలి డిపాజిటరీ సర్వీస్ కంపెనీ సీడీఎస్ఎల్యే కావడం విశేషం. ఇప్పటికే మాతృ సంస్థ బీఎస్ఈ జనవరిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా దేశంలో లిస్టింగ్ పొందిన తొలి ఎక్స్ఛేంజీగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఐపీవో ద్వారా బీఎస్ఈ రూ. 1243 కోట్లను సమీకరించింది. త్వరలోనే బీఎస్ఈకి ప్రధాన ప్రత్యర్థి అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) సైతం లిస్ట్కానుంది. ఇందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది కూడా.