వరుసగా నాలుగో రోజూ నిఫ్టీ రికార్డు క్లోజింగ్
ఐటీసీ మంచి లాభాల దిశగా పయనించిన తర్వాత ఈ రోజుల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో పాటు, రుతు పవనాలు ఆశాజనకంగా ఉండటం ఈ రోజు మార్కెట్ పనితీరును ప్రభావితం చేశాయి. దీంతో కన్సాలిడేషన్
ఐటీసీ మంచి లాభాల దిశగా పయనించిన తర్వాత ఈ రోజుల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో పాటు, రుతు పవనాలు ఆశాజనకంగా ఉండటం ఈ రోజు మార్కెట్ పనితీరును ప్రభావితం చేశాయి. దీంతో కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసేసరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అయినప్పటికీ మళ్లీ సరికొత్త రికార్డు గరిష్టాలను సాధించాయి. 50 పాయింట్లు బలపడ్డ సెన్సెక్స్ 31,159 వద్ద నిలవగా.. నిఫ్టీ 20 పాయింట్లు పుంజుకొని 9,624 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డు ముగింపులు కాగా.. ఇంట్రాడేలోనూ నిఫ్టీ 9,635ను తాకింది.
ఇటీవల లాభపడుతూ వచ్చిన ఎఫ్ఎంసీజీ రంగం 0.6 శాతం నష్టాల దిశగా పయనించగా.. రెండు వారాలుగా నష్టాల బాటలో సాగుతున్న ఫార్మా 2.7 శాతం పైకి ఎగసింది. ఇదే విదంగా పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా.. స్థిరాస్తి 1 శాతం బలపడింది. ఇందుకు ట్రేడర్ల షార్ట్కవరింగ్, లాభాల స్వీకరణ వంటి అంశాలు కారణమని నిపుణులు పేర్కొన్నారు.