For Daily Alerts
నాలుగో త్రైమాసికంలో ఎస్బీఐ లాభం రెండింతలు
దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐ నాలుగో త్రైమాసికంలో 123 శాతం లాభాన్ని నమోదు చేసింది. ఏకీకృత ప్రాతిపదికన మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.2815 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో నికర లాభం రూ.1
|
దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐ నాలుగో త్రైమాసికంలో 123 శాతం లాభాన్ని నమోదు చేసింది. ఏకీకృత ప్రాతిపదికన మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.2815 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో నికర లాభం రూ.1264 కోట్లుగా ఉంది.
నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పెరిగి రూ. 18,071 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు రూ. 13,174 కోట్ల నుంచి రూ. 11,740 కోట్లకు క్షీణించాయి. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.23 శాతం నుంచి 6.9 శాతానికి కాస్త ఫర్వాలేదనిపించగా.. నికర ఎన్పీఏలు సైతం 4.24 శాతం నుంచి 3.71 శాతానికి తగ్గాయి. తాజా బకాయిలు(స్లిప్పేజెస్) రూ. 9,755 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 2 శాతం ఎగసి రూ. 308 వద్ద ముగిసింది.
Comments
English summary
నాలుగో త్రైమాసికంలో ఎస్బీఐ లాభం రెండింతలు | SBI Q4 net profit more than doubles to Rs. 2,815 cr
Story first published: Friday, May 19, 2017, 16:46 [IST]