30,659 స్థాయిని చేరిన సెన్సెక్స్
గత వారం అంచనాలకు తగ్గట్లుగానే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డులను నమోదు చేస్తున్నాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 76 పాయింట్లు లాభపడి 30,658 రికార్డు పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 13.5
గత వారం అంచనాలకు తగ్గట్లుగానే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డులను నమోదు చేస్తున్నాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 76 పాయింట్లు లాభపడి 30,658 రికార్డు పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 13.50 పాయింట్లు ఎగసి 9525.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీకి సైతం ఇదే అత్యధిక రికార్డు క్లోజింగ్.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం 2.37% బలపడింది. దాని తర్వాత వాహన రంగం(0.57%), మూలధన వస్తువులు(0.22%), విద్యుత్(0.14%) లాభపడ్డాయి. వినియోగదారు వస్తువులు(0.76%), చమురు,సహజ వాయు(0.37%), హెల్త్కేర్(0.3%), పీఎస్యూ(0.23%) నష్టపోయాయి.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో టాటా స్టీల్(7.95%), టాటా మోటార్స్(2.82%), ఐసీఐసీఐ బ్యాంకు(2.35%), టీసీఎస్(0.99%), ఏసియన్ పెయింట్స్(0.88%) ఉండగా ; నష్టపోయిన వాటిలో విప్రో(1.7%), అదానీ పోర్ట్స్(1.4%), హెచ్డీఎఫ్సీ(1.06%), సిప్లా(0.94%), గెయిల్(0.56%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications